NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850
    తదుపరి వార్తా కథనం
    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850
    నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850

    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2025
    09:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపించింది.

    ఫలితంగా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 22,850 కంటే తక్కువ వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 330 పాయింట్లు క్షీణించి 75,609 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు తగ్గి 22,851 వద్ద కొనసాగింది.

    సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఐటీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,జొమాటో,సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

    వివరాలు 

    రూపాయి-డాలర్ మారకం విలువ 86.86 

    మరోవైపు, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    రూపాయి-డాలర్ మారకం విలువ 86.86 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 71.96 డాలర్లుగా ఉంది, బంగారం ఔన్సు 2,960.30 డాలర్ల వద్ద కదలాడుతోంది.

    అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం స్థిరంగా ముగిశాయి.ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1.50 శాతం,జపాన్ నిక్కీ 1.49శాతం,హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.75 శాతం,షాంఘై సూచీ 0.22 శాతం నష్టాల్లో ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తమ విక్రయాలను తగ్గిస్తున్నారు.

    బుధవారం వారు నికరంగా రూ.1,881కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)నికరంగా రూ.1,958కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా? నిద్రలేమి
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    స్టాక్ మార్కెట్

    Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్ బిజినెస్
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 535 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభం  బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన బిజినెస్
    ITC Hotels: రూ.180 వద్ద అరంగేట్రం చేసిన ITC హోటల్స్.. 11% ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చిన డెంటా వాటర్‌ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025