NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market crash: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు... వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market crash: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు... వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌
    భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock market crash: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు... వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 11, 2025
    01:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గణనీయమైన నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.

    స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం, అలాగే ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండవని వెల్లడించడంతో వాణిజ్య యుద్ధ భయాలు పెరుగుతున్నాయి.

    ఈ పరిస్థితిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స్మాల్‌, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో కూడా అమ్మకాలు పెరిగాయి.

    వివరాలు 

    ₹10 లక్షల కోట్లు ఆవిరి!

    సెన్సెక్స్ 1,000కు పైగా పాయింట్లు కోల్పోయినట్లుగా ఉండగా, నిఫ్టీ 23,000 స్థాయికి చేరుకుంది.

    మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి, సెన్సెక్స్ 1,099.94 పాయింట్ల నష్టంతో 76,211.86 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 342.95 పాయింట్ల నష్టంతో 23,038.65 వద్ద ఉంది.

    సెన్సెక్స్-30 సూచీలోని అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. జొమాటో, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి.

    మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లు తగ్గి, రూ.408 లక్షల కోట్లకు పడిపోయింది.

    వివరాలు 

    కారణాలు ఇవే.. 

    స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా అధిక టారిఫ్ విధించడమే కాకుండా, తమపై సుంకాలు విధిస్తున్న దేశాలకు ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించడంతో వాణిజ్య భయాలు పెరిగాయి.

    దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 10న మాత్రమే వారు రూ.2,463 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.

    రూపాయి మరింత బలహీనపడుతుండటంతో విదేశీ మదుపర్లు అమ్మకాలు ఎక్కువగా చేస్తున్నారు.

    క్యూ3 ఫలితాలు మదుపర్లను మెప్పించకపోవడం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు

    స్టాక్ మార్కెట్

    Stock Market: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం..ఒడిదొడుకుల్లో భారత స్టాక్‌ మార్కెట్లు బిజినెస్
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 454, నిఫ్టీ 141 పాయింట్లు  బిజినెస్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ బిజినెస్
    Stock market crash: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹7లక్షల కోట్లు ఆవిరి  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025