NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
    ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

    Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 05, 2025
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్నఅంచనాలతో సూచీలు రాణించాయి.

    ఐటీ, ఔషధ రంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) తిరిగి కొనుగోలుదారులుగా ముందుకు రావడం మార్కెట్‌ను మరింత బలపరిచింది.

    ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 800 పాయింట్ల మేర రాణించింది.

    ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్‌ 81,196.08 పాయింట్ల వద్ద (ముందురోజు ముగింపు స్థాయి 80,998.25 పాయింట్లు) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది.

    ముఖ్యమైన షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో సూచీ ఇంట్రాడేలో 81,911.13 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.10 డాలర్లు 

    చివరికి ఇది 443 పాయింట్ల లాభంతో 81,442 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 24,899 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసి, చివరికి 130 పాయింట్ల లాభంతో 24,750 వద్ద ముగిసింది.

    సెన్సెక్స్‌కు చెందిన 30 ప్రధాన షేర్లలో ఎటర్నల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌,రిలయన్స్ ఇండస్ట్రీస్‌,అల్ట్రాటెక్ సిమెంట్‌,అదానీ పోర్ట్స్‌,సన్ ఫార్మా,ఐటీసీ,హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

    అయితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఫైనాన్స్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

    అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.10 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,413 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market: ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు స్టాక్ మార్కెట్
    Bengaluru: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కర్ణాటక
    Sharmishta Panoli: శ‌ర్మిష్ట ప‌నోలికి కోల్‌క‌తా హైకోర్టులో ఊర‌ట.. తాత్కాలిక బెయిల్ మంజూరు  కోల్‌కతా
    Rafale: మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు.. టాటా, డసో మధ్య ఒప్పందం హైదరాబాద్

    స్టాక్ మార్కెట్

    Stock Market: పుంజుకున్నా స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1800 పాయింట్లు పెరుగుదల! సెన్సెక్స్
    Stock Market: కాల్పుల విరమణ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు బిజినెస్
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు డౌన్‌  బిజినెస్
    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025