NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ 
    లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ

    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో, కీలక రంగాలైన ఐటీ, ఆటోమొబైల్, లోహ (మెటల్) రంగాలకు చెందిన కంపెనీల స్టాకులు మార్కెట్‌కు బలాన్ని అందించాయి.

    వరుసగా రెండవ ట్రేడింగ్ సెషన్‌లోనూ సూచీలు పాజిటివ్‌గా కొనసాగాయి.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక ప్రకటన నేపథ్యంలో వాణిజ్య చర్చల గడువును జూలై 9 వరకు పెంచినట్లు వెల్లడించడం, అలాగే 50 శాతం దిగుమతి సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేయడం మార్కెట్లలో అనిశ్చితులను తక్కువ చేసింది.

    ఈ పరిస్థితుల్లో ఆసియా మార్కెట్లు బలంగా కనిపించగా, భారత మార్కెట్లూ అదే ధోరణిలో రాణించాయి.

    వివరాలు 

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.10

    ఈ ప్రభావంతో నిఫ్టీ సూచీ 25,000 మార్కును దాటి స్థిరపడింది. మరోవైపు సెన్సెక్స్‌ ఉదయం 81,928.95 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై (గత ముగింపు 81,721.08) రోజు పొడవునా అదే స్థాయిలో సాగింది.

    ఇంట్రాడే ట్రేడింగ్‌లో 82,492.24 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్‌ చివరికి 455.37 పాయింట్ల లాభంతో 82,176.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 148 పాయింట్లు పెరిగి 25,001 వద్ద నిలిచింది.

    విదేశీ మారకద్రవ్యాలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 35 పైసలు బలపడి 85.10కి చేరుకుంది.

    సెన్సెక్స్‌లో భాగమైన 30 షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా,హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఐటీసీ లాంటి షేర్లు ముఖ్యంగా లాభాల్లో ఉన్నాయి.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.75 డాలర్లు 

    మరోవైపు ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా,ఎన్టీపీసీ స్టాకులు నష్టపోయాయి.

    అంతర్జాతీయంగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.75 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,332 డాలర్ల వద్ద ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ? పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    #NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి? డీఆర్జీ దళాలు
    Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు విరాట్ కోహ్లీ

    స్టాక్ మార్కెట్

    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు..  బిజినెస్
    Stock Market: స్వల్పంగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు  బిజినెస్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock market: సెన్సెక్స్‌ 259 పాయింట్ల లాభం.. 12 పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ.. బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025