
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 25 వేల ఎగువన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో, కీలక రంగాలైన ఐటీ, ఆటోమొబైల్, లోహ (మెటల్) రంగాలకు చెందిన కంపెనీల స్టాకులు మార్కెట్కు బలాన్ని అందించాయి.
వరుసగా రెండవ ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు పాజిటివ్గా కొనసాగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక ప్రకటన నేపథ్యంలో వాణిజ్య చర్చల గడువును జూలై 9 వరకు పెంచినట్లు వెల్లడించడం, అలాగే 50 శాతం దిగుమతి సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేయడం మార్కెట్లలో అనిశ్చితులను తక్కువ చేసింది.
ఈ పరిస్థితుల్లో ఆసియా మార్కెట్లు బలంగా కనిపించగా, భారత మార్కెట్లూ అదే ధోరణిలో రాణించాయి.
వివరాలు
డాలర్తో రూపాయి మారకం విలువ 85.10
ఈ ప్రభావంతో నిఫ్టీ సూచీ 25,000 మార్కును దాటి స్థిరపడింది. మరోవైపు సెన్సెక్స్ ఉదయం 81,928.95 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై (గత ముగింపు 81,721.08) రోజు పొడవునా అదే స్థాయిలో సాగింది.
ఇంట్రాడే ట్రేడింగ్లో 82,492.24 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరికి 455.37 పాయింట్ల లాభంతో 82,176.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 148 పాయింట్లు పెరిగి 25,001 వద్ద నిలిచింది.
విదేశీ మారకద్రవ్యాలలో డాలర్తో రూపాయి మారకం విలువ 35 పైసలు బలపడి 85.10కి చేరుకుంది.
సెన్సెక్స్లో భాగమైన 30 షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా,హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, ఐటీసీ లాంటి షేర్లు ముఖ్యంగా లాభాల్లో ఉన్నాయి.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 64.75 డాలర్లు
మరోవైపు ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్, సన్ఫార్మా,ఎన్టీపీసీ స్టాకులు నష్టపోయాయి.
అంతర్జాతీయంగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 64.75 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,332 డాలర్ల వద్ద ఉంది.