Page Loader
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం 
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నిన్న దూసుకెళ్లిన మన స్టాక్ మార్కెట్ సూచీలు, నేడు మాత్రం భారీ నష్టాలను నమోదు చేశాయి. మదుపర్లు తమ లాభాలను సురక్షితంగా తీసుకోవడం (లాభాల స్వీకరణ) ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ సంస్థల షేర్లలో అమ్మకాలు జరగడం సూచీలను క్రిందకు లాగాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్‌ ఒక దశలో 1300 పాయింట్ల వరకూ పడిపోయింది. నిఫ్టీ సూచీ 24,600 స్థాయికి కూడా దిగువకు చేరింది.

వివరాలు 

రోజంతా నష్టాల్లోనే ట్రేడ్‌ 

సెన్సెక్స్‌ ఈ రోజు ట్రేడింగ్‌ను 82,249.60 పాయింట్ల వద్ద ప్రారంభించింది, ఇది గత ముగింపు స్థాయి అయిన 82,429.90 కంటే తక్కువ. రోజంతా మార్కెట్ నెగిటివ్ ట్రెండ్‌లోనే కొనసాగింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్‌ కనిష్ఠంగా 81,043.69 పాయింట్ల వరకు పడిపోయింది. చివరికి ఈ సూచీ 1281.68 పాయింట్ల నష్టంతో 81,148.22 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 346.35 పాయింట్లు నష్టపోయి 24,578.35 వద్ద క్లోజ్ అయ్యింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.85.33 వద్ద ఉంది.

వివరాలు 

లాభాల్లో ముగిసిన కొద్ది షేర్లు మాత్రమే 

సెన్సెక్స్‌కు చెందిన 30 షేర్లలో సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగిలిన వాటన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, టీసీఎస్‌ వంటి ఐటీ కంపెనీలు ముఖ్యంగా నష్టాల్లో నిలిచాయి. ఈ నష్టాలకు వెనుక ఉన్న కారణాలు నిన్న సెన్సెక్స్‌, నిఫ్టీలు గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని రీతిలో బలంగా పెరిగాయి. అయినప్పటికీ, విదేశీ మదుపుదారులు (ఎఫ్‌ఐఐలు) దేశీయ సంస్థాగత మదుపుదారులు (డీఐఐలు) కలిపి కొనుగోలు చేసిన ఈక్విటీ విలువ రూ.2694 కోట్ల మేరకే పరిమితమైంది. రిటైల్‌ మదుపుదారులు,హెచ్‌ఎన్‌ఐలు మాత్రమే ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. దీంతో నేడు మార్కెట్ గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణను చూచింది.

వివరాలు 

ఈ నష్టాలకు వెనుక ఉన్న కారణాలు 

అమెరికా - చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో సానుకూలత రావడం వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లలో మానసికంగా ఒక సానుకూలత నెలకొంది. కానీ ఇది భారత మార్కెట్‌కు మాత్రం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంతవరకు ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే భారత్‌కు పరోక్ష లాభం కలుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. తాజా పరిణామాలు ఆ అంచనాలకు షాక్ ఇచ్చాయి. క్రూడాయిల్ ధరల పెరుగుదల - మరో ప్రధాన సమస్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 65డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి ఇది ఒక ప్రతికూల అంశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా మార్కెట్‌లో నష్టాలకు ఒక కారణమైంది.

వివరాలు 

ఈ నష్టాలకు వెనుక ఉన్న కారణాలు 

దిగ్గజ స్టాక్స్‌ వల్లే భారీ నష్టం హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు కలిపి సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్ల నష్టానికి కారణమయ్యాయి. ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా భారీ అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ఇవి నష్టాల్లో ముగిశాయి.