NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. . సెన్సెక్స్‌ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. . సెన్సెక్స్‌ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు
    నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. . సెన్సెక్స్‌ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. . సెన్సెక్స్‌ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాలను పొందిన సూచీలు, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

    వచ్చే కొన్ని రోజుల్లో ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టనుండడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి.

    ఒక దశలో, సెన్సెక్స్ 700 పాయింట్ల మేర నష్టపోయింది, తరువాత కొంత కోలుకుంది. నిఫ్టీ 23,200 స్థాయికి చేరింది.

    వివరాలు 

    డాలరుతో రూపాయి మారకం విలువ 86.61

    సెన్సెక్స్ ఉదయం 77,069.19 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,042.82) స్వల్ప లాభాలతో ప్రారంభమైంది.

    కాసేపటికే అది నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,263.29 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, చివరికి 423.49 పాయింట్ల నష్టంతో 76,619.33 వద్ద ముగిసింది.

    నిఫ్టీ కూడా 108.60 పాయింట్ల నష్టంతో 23,203.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.61 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.

    వివరాలు 

     బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 81 డాలర్లు 

    సెన్సెక్స్ 30 సూచీలో గురువారం ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ 6 శాతం మేర నష్టపోయింది.

    బలహీన త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్ 5 శాతం మేర క్షీణించింది. దీని ప్రభావం ఇతర బ్యాంక్ షేర్లపైనా పడింది.

    కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ కూడా నష్టాల్లో ముగిశాయి.

    జొమాటో, రిలయన్స్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

    అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 81 డాలర్ల ఎగువన ట్రేడవుతుండగా, బంగారం 2730 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    స్టాక్ మార్కెట్

    Stock market today: లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 498, నిఫ్టీ 165 పాయింట్లు చొప్పున లాభం  బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 23,750 మార్క్‌ బిజినెస్
    Stock market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..  బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,800 మార్క్‌ పైన నిఫ్టీ  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025