NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు 
    లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2025
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిసాయి.గత మూడు ట్రేడింగ్ సెషన్లుగా నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు ఈరోజు మోస్తరు లాభాలను నమోదు చేశాయి.

    ట్రేడింగ్ సమయంలో ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్ల వరకు పెరిగింది.ముఖ్యంగా రియల్టీ, ఫార్మా రంగాల్లోని షేర్లలో బలమైన కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి.

    అదేవిధంగా ఆటో, బ్యాంకింగ్,ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో కూడా మంచి పనితీరు కనిపించింది,ఇది సూచీల లాభాలకు మద్దతిచ్చింది.

    అయితే, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారులు మార్కెట్లలో అమ్మకాలు కొనసాగించడంపై మార్కెట్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

    ఈ విదేశీ విక్రయాలు మార్కెట్లు మరింతగా ఎగబాకేందుకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    వివరాలు 

    నిఫ్టీ సూచీ 129.55 పాయింట్లు పెరిగి 24,813.45 వద్ద ముగిసిన ట్రేడింగ్

    సెన్సెక్స్ ఈరోజు ఉదయం 81,327.61 పాయింట్ల వద్ద లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించింది.

    ఇది గత ముగింపు స్థాయి అయిన 81,186.44 పాయింట్ల కంటే ఎక్కువ. ఇంట్రాడేలో సూచీ 82,021.64 పాయింట్ల గరిష్ఠానికి చేరింది.

    చివరికి ఇది 410 పాయింట్ల లాభంతో 81,596.63 పాయింట్ల వద్ద స్థిరపడింది.నిఫ్టీ సూచీ 129.55 పాయింట్లు పెరిగి 24,813.45 వద్ద ట్రేడింగ్ ముగించింది.

    రూపాయి మారకం విలువ అమెరికన్ డాలరుతో 85.64గా నమోదైంది.సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో బజాజ్ ఫిన్‌సర్వ్,టాటా స్టీల్,సన్‌ఫార్మా,టెక్ మహీంద్రా,బజాజ్ ఫైనాన్స్ షేర్లు ముఖ్యంగా లాభాలు పొందినవిగా కనిపించాయి.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.17 డాలర్లు 

    మరోవైపు, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలు చవిచూశాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల పరంగా చూస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సు (ounce)కు 3,314 డాలర్ల వద్ద నిలకడగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్
    China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం  చైనా
    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న దేశీయ మార్కెట్లు  బిజినెస్
    Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు వ్యాపారం
    Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. రిలయన్స్‌ షేరు 5శాతం పెరుగుదల వ్యాపారం
    Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025