NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Gold ATM: షాంఘైలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'Gold ATM' ఏర్పాటు.. భారతదేశం తర్వాతి స్థానంలో ఉందా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Gold ATM: షాంఘైలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'Gold ATM' ఏర్పాటు.. భారతదేశం తర్వాతి స్థానంలో ఉందా?
    షాంఘైలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'Gold ATM' ఏర్పాటు..

    Gold ATM: షాంఘైలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'Gold ATM' ఏర్పాటు.. భారతదేశం తర్వాతి స్థానంలో ఉందా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన చైనా, సాంకేతిక రంగంలో పరుగులు పెడుతోంది.

    కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవలి కాలంలో, చైనాలోని అతిపెద్ద నగరంగా పేరుగాంచిన షాంఘైలో ఒక వినూత్న ప్రయత్నం చేశారు.

    అక్కడి ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో తొలి "గోల్డ్ ఏటీఎం"ను (Gold ATM) ఏర్పాటు చేశారు.

    ఇది షాంఘై నగరంలో ఏర్పాటైన ప్రథమ బంగారపు ఏటీఎంగా గుర్తింపు పొందింది.

    ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో, ఈ ప్రత్యేకమైన ఏటీఎం యంత్రం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

    స్థానిక మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఈ ఏటీఎం దగ్గర ఎప్పుడూ వినియోగదారులతో రద్దీగా ఉంటోంది.

    వివరాలు 

    బంగారాన్ని తూకం వేస్తుంది

    ఈ గోల్డ్ ఏటీఎం ప్రత్యేకత విషయానికొస్తే,ఇది 1200 డిగ్రీల సెల్సియస్ వద్ద బంగారాన్ని కరిగించి,దాని స్వచ్ఛతను పరీక్షిస్తుంది.

    అంతేగాక ప్రత్యక్ష ధరను సైతం చూపిస్తుంది. వినియోగదారులు బంగారం విక్రయించిన తర్వాత, ఆ మొత్తానికి సమానంగా బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేసే విధంగా సదుపాయాన్ని కల్పించారు.

    ఈ అత్యాధునిక ఫీచర్ల కారణంగా,ప్రజల్లో ఆసక్తి పెరిగిందని అక్కడి వర్గాలు వెల్లడించాయి.

    ఈ యంత్రం ద్వారా బంగారంతో సంబంధిత లావాదేవీలు జరపడం చాలా సులభం.

    మొదటగా, యంత్రం బంగారాన్ని తూకం వేస్తుంది. ఆ తర్వాత, అది 99.99 శాతం స్వచ్ఛమైనదా కాదా అన్న విషయాన్ని గుర్తిస్తుంది.

    వివరాలు 

     చైన్ స్నాచర్లకు మాత్రం పండుగే

    తదుపరి దశలో, షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్‌లో ప్రస్తుత బంగారం రేటును ఆధారంగా చేసుకుని ధరను లెక్కించుతుంది.

    ప్రస్తుతం ఈ గోల్డ్ ఏటీఎం గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది.

    ఎక్స్'లో ఒక వినియోగదారుడు స్పందిస్తూ.. "వావ్! త్వరలో భారత్‌లో కూడా ఇలాంటి గోల్డ్ ఏటీఎంలను చూడాలనుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.

    మరో నెటిజన్ సరదాగా స్పందిస్తూ - "ఇది భారత్‌కు వస్తే గొప్ప ఆవిష్కరణ అవుతుంది, కానీ చైన్ స్నాచర్లకు మాత్రం పండుగే" అంటూ హాస్యంగా వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    చైనా

    Luo Fuli: డీప్‌సీక్‌ విజయం వెనక 'లువో' మేధస్సే కారణం.. ఆమె ఎవరంటే? డీప్‌సీక్‌
    Donald Trump: కెనడా, మెక్సికో, చైనాలకు షాకిచ్చిన ట్రంప్  డొనాల్డ్ ట్రంప్
    Donald Trump: పనామా కాలువపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. తీవ్ర చర్యలుంటాయని హెచ్చరిక డొనాల్డ్ ట్రంప్
    OpenAI: ఓపెన్‌ఏఐ 'డీప్‌ రీసెర్చ్'.. చైనా 'డీప్‌సీక్‌'తో పోటీ పడుతున్న కొత్త ఏఐ టూల్ ఓపెన్ఏఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025