LOADING...
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్‌.. జూలై 15 నుంచి కొత్త నిబంధనలు!
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్‌.. జూలై 15 నుంచి కొత్త నిబంధనలు!

SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్‌.. జూలై 15 నుంచి కొత్త నిబంధనలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రెడిట్ కార్డులు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా మారడంతో, వాటిని వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మీ వద్ద కూడా క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే, ముఖ్యంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తుంటే, ఈ మార్పులు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే జూలై 15, 2025 నుంచి కొన్ని ముఖ్యమైన నిబంధనలు మారనున్నాయి. వాటిలో ముఖ్యంగా కనిష్ఠ బకాయి మొత్తం (Minimum Amount Due - MAD) విధానంలో కీలక మార్పులు, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ తొలగింపును పొందుపరిచారు.

Details

జూలై 15 నుంచి కనిష్ఠ బకాయి మొత్తంలో మార్పులు

ఎస్‌బీఐ కార్డ్ వెబ్‌సైట్‌లో ప్రకారం, జూలై 15 నుంచి వినియోగదారులకు బిల్లుపై చెల్లించాల్సిన కనిష్ఠ మొత్తాన్ని (MAD) కొత్త విధానంలో లెక్కించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న విధానానికి భిన్నంగా, ఇకపై క్రెడిట్ కార్డ్ బకాయి మొత్తంలో 2 శాతం పాటు, జీఎస్టీ మొత్తాన్ని 100 శాతం, అలాగే మీ EMI బ్యాలెన్స్, ఇతర ఫీజులు, ఫైనాన్స్ ఛార్జీలు, ఓవర్‌లిమిట్ మొత్తాలు (అవసరమైతే) కూడా MADలో చేర్చబడతాయి. ఫలితంగా వినియోగదారులు చెల్లించాల్సిన కనిష్ఠ మొత్తం ప్రస్తుతం కంటే మరింత పెరగనుంది.

Details

కనిష్ఠ మొత్తం(MAD) అంటే ఏమిటి?

ప్రతి నెలా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో మీరు తప్పనిసరిగా చెల్లించాల్సిన కనిష్ఠ మొత్తాన్ని MAD అంటారు. ఇది సాధారణంగా మొత్తం బకాయి బిల్లులో 2% నుండి 5% వరకు ఉండొచ్చు. ఈ మొత్తం చెల్లిస్తే ఆలస్య ఛార్జీలు తప్పించుకోవచ్చు. అయితే, మొత్తంగా బకాయి చెల్లించకుండా కేవలం MAD మాత్రమే చెల్లిస్తే, మిగతా మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది. అందుకే వినియోగదారులు సదా మొత్తం బకాయినే చెల్లించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

Details

ఉచిత విమాన ప్రమాద బీమా ఇకపై అందుబాటులో ఉండదు 

జూలై 15 నుంచి అమల్లోకి రానున్న మరో ముఖ్యమైన మార్పు, క్రెడిట్ కార్డ్‌లపై ఇప్పటివరకు అందుతున్న ఉచిత విమాన ప్రమాద బీమాను నిలిపివేయడంపై ఆధారపడింది. ఇప్పటివరకు ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, మైల్స్ ఎలైట్, మైల్స్ ప్రైమ్ వంటి కార్డుల వినియోగదారులకు రూ.1 కోటి వరకూ కాంప్లిమెంటరీ విమాన ప్రమాద బీమా అందుబాటులో ఉండేది. కానీ ఈ బీమా జూలై 15 తర్వాత నిలిపివేయనుంది. అంతేకాక ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్, ఎస్‌బీఐ కార్డ్ పల్స్ వంటి ఇతర కార్డులకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న రూ.50 లక్షల కాంప్లిమెంటరీ విమాన ప్రమాద కవర్ కూడా రద్దయ్యే అవకాశముంది.

Advertisement

Details

భవిష్యత్తులో ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపొచ్చు

దీని ప్రభావం అన్ని వర్గాల వినియోగదారులపై పడనుంది. క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ కొత్త మార్పులను జూలై 15కల్లా సరిగా గ్రహించుకోవాలి. కనిష్ఠ బకాయి మొత్తంపై కొత్త విధానం, ఉచిత ఇన్సూరెన్స్ తొలగింపు వంటి కీలక విషయాలు భవిష్యత్తులో ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపవచ్చు. తగిన మార్గాల్లో వినియోగాన్ని పునర్విమర్శించుకోవడం మంచిదవుతుంది.

Advertisement