NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 
    ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

    తొలుత స్థిరంగా ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం మార్కెట్ మిశ్రమంగా కదలాడుతోంది.

    ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ (Sensex) 9 పాయింట్లు నష్టపోయి 78,007 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ (Nifty) 22 పాయింట్ల లాభంతో 23,690 వద్ద ఉంది.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 73.27 డాలర్లు 

    సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    మరోవైపు, జొమాటో, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 73.27 డాలర్ల వద్ద ఉంది.

    బంగారం ధర ఔన్సుకు 3,023 డాలర్ల మార్క్‌ను దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.77 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    స్వల్ప లాభాలతో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు

    అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.

    ఎస్‌అండ్‌పీ సూచీ 0.16 శాతం, నాస్‌డాక్ 0.46 శాతం లాభపడగా, డౌజోన్స్ స్థిరంగా ముగిసింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 0.90 శాతం, జపాన్ నిక్కీ 0.29 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.34 శాతం, షాంఘై 0.19 శాతం లాభంతో కదలాడుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం రూ.5,372 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.2,769 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Sophia Qureshi: కర్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు మధ్యప్రదేశ్
    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా

    స్టాక్ మార్కెట్

    Stock market crash: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు,నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం! బిజినెస్
    Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ సూచీలు.. బిజినెస్
    Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,119  బిజినెస్
    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025