NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
    తదుపరి వార్తా కథనం
    మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
    భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

    మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ సూచీ 676 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.

    ఉదయం 66,064.41 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభమైంది. ఈ మేరకు బుధవారం అధిక సమయం నష్టాల్లోనే ట్రేడ్ అయ్యింది. ఒక దశలో 1000 పాయింట్లకుపైగా నష్టపోయి 65,431.68కు దిగజారింది.

    సెషన్ చివరిలో కొద్దిగా కోలుకుని 676.53 పాయింట్ల నష్టానికి 65,782.78 వద్ద ట్రేడింగ్ ముగించింది. మరోవైపు నిఫ్టీ 207 పాయింట్ల మేర నష్టంతో 19,526.55 పాయింట్ల వద్ద నిలిచింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.58గా ఉండం గమనార్హం.

    అగ్రరాజ్యం అమెరికా రేటింగ్‌ను ఫిచ్‌ ఏజెన్సీ తగ్గించడంతో మదుపర్లలో నైరాశ్యం కనిపించింది.

    DETAILS

    అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్‌ మార్కెట్లు సైతం నష్టాల్లో కూరుకుపోయాయి

    AAAగా ఉన్న రేటింగ్‌ను AA+కు కుదించింది. వచ్చే 3 ఏళ్లలో అగ్రదేశం ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించనుందనే సంకేతాలను వెలువరించింది.

    ఈ నేపథ్యంలోనే రుణభారం పెరుగుదలను ఇందుకు కారణంగా ప్రకటించింది. ఈ మేరకు ఇన్వెష్టర్లలో ప్రతికూల ప్రభావాన్ని నింపినట్టైంది.

    2011లోనూ స్టాండర్డ్‌ పూర్ రేటింగ్‌ ఏజెన్సీ అగ్రరాజ్యం రేటింగ్‌ను కుదించింది. మళ్లీ 2023లో అదే మాదిరిగా స్పందించడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నష్టాలను చవిచూశాయి.

    ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్‌ మార్కెట్లు సైతం నష్టాల్లో కూరుకుపోయాయి.

    ఫిచ్‌ అంచనాతో సెన్సెక్స్‌ ఓ దశలో భారీగా సుమారు వెయ్యి పాయింట్లకుపైగా కుదేలైంది. క్రమంగా పుంజుకుని 676 వద్ద స్థిరీకరించింది. పిచ్‌ రేటింగ్ ప్రభావం తాత్కాలికంగానే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెన్సెక్స్
    స్టాక్ మార్కెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సెన్సెక్స్

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్
    భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్
    నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత  స్టాక్ మార్కెట్

    స్టాక్ మార్కెట్

    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి అదానీ గ్రూప్
    'హిండెన్‌బర్గ్' ఎఫెక్ట్: ఫిబ్రవరి 6న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆఫీస్‌ల ఎదుట కాంగ్రెస్ నిరసన కాంగ్రెస్
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025