NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 
    తదుపరి వార్తా కథనం
    Stock market: వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 
    వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    Stock market: వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల ధోరణి కొనసాగుతోంది.వరుసగా ఆరో రోజూ సూచీలు నష్టపోయాయి.

    ఒక దశలో సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి.సెన్సెక్స్ 76,000,నిఫ్టీ 23,000 దిగువకు చేరాయి.

    అయితే, సూచీలు తిరిగి బలంగా పుంజుకోవడం, స్వల్ప నష్టాలకే పరిమితం కావడం మదుపర్లకు కొంత ఊరటనిచ్చింది.

    రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా,ఐటీసీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచగా,హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ అండ్‌ టీ,కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి.

    సెన్సెక్స్ ఉదయం 76,188.24 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 76,293.60) నష్టాలతో ప్రారంభమైంది.

    రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులు ఎదుర్కొంది.ఒక దశలో దాదాపు 900పాయింట్ల నష్టంతో 75,388.39 కనిష్ఠ స్థాయికి చేరిన సూచీ, మళ్లీ బలంగా పుంజుకొని 76,459 పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకుంది.

    వివరాలు 

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 76 డాలర్లు 

    చివరికి 122.52 పాయింట్ల నష్టంతో 76,171.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.80 పాయింట్ల నష్టంతో 23,044 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 86.88 వద్ద ముగిసింది.

    సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఎల్‌ అండ్‌ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 76 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర కొంత తగ్గి 2910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ బిజినెస్
    Stock market crash: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. ₹7లక్షల కోట్లు ఆవిరి  బిజినెస్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,000 బిజినెస్
    Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 566, నిఫ్టీ 130 పాయింట్లు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025