Stock Market: ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 75,555 .. నిఫ్టీ 22,546
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
దీంతో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్ల ప్రభావం సూచీలపై ఒత్తిడిని పెంచుతోంది.
ప్రారంభంలో స్థిరంగా ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం మిశ్రమంగా కదులుతున్నాయి.
ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 101 పాయింట్లు పెరిగి 75,555 వద్ద, నిఫ్టీ (Nifty) 9 పాయింట్లు తగ్గి 22,546 వద్ద కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, జొమాటో, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్యూఎల్, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
వివరాలు
మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు
ఎల్అండ్టీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.14 డాలర్ల వద్ద ఉంది. బంగారం ఔన్సు 2,961.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి.ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.60 శాతం,జపాన్ నిక్కీ 1.11 శాతం,హాంకాంగ్ హాంగ్సెంగ్ 0.63 శాతం,షాంఘై 0.19 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)సోమవారం నికరంగా రూ.6,287 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)నికరంగా రూ.5,186 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డాలర్తో రూపాయి మారకం విలువ 86.88 వద్ద కొనసాగుతోంది.