NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 75,555 .. నిఫ్టీ 22,546 
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 75,555 .. నిఫ్టీ 22,546 
    ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు..

    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 75,555 .. నిఫ్టీ 22,546 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    09:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    దీంతో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్ల ప్రభావం సూచీలపై ఒత్తిడిని పెంచుతోంది.

    ప్రారంభంలో స్థిరంగా ప్రారంభమైన సూచీలు ప్రస్తుతం మిశ్రమంగా కదులుతున్నాయి.

    ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 101 పాయింట్లు పెరిగి 75,555 వద్ద, నిఫ్టీ (Nifty) 9 పాయింట్లు తగ్గి 22,546 వద్ద కొనసాగుతున్నాయి.

    సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, జొమాటో, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    వివరాలు 

     మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

    ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.14 డాలర్ల వద్ద ఉంది. బంగారం ఔన్సు 2,961.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి.ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి.

    ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.60 శాతం,జపాన్ నిక్కీ 1.11 శాతం,హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.63 శాతం,షాంఘై 0.19 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)సోమవారం నికరంగా రూ.6,287 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

    దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)నికరంగా రూ.5,186 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.88 వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా? నిద్రలేమి
    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    స్టాక్ మార్కెట్

    Stock Market: నేడు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభం.. ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock market: బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లకు లాభామా.. నష్టమా? .. గత పదేళ్లు ఎలా ఉన్నాయంటే? బడ్జెట్
    Stock market: కేంద్ర బడ్జెట్‌ ప్రభావం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు బడ్జెట్‌ 2025
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 5 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025