Page Loader
Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!
లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!

Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2024
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య, శుక్రవారం జరగనున్న ఆర్‌ బి ఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సూచీలు తేలికపాటి మార్పులతో కదలాడుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 155 పాయింట్లు పెరిగి 81,112 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 24,510 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 84.71 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో ఇన్ఫోసిస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటార్స్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్ షేర్లు మంచి ప్రదర్శన కనపరుస్తున్నాయి.

వివరాలు 

రికార్డు స్థాయిలో లక్ష డాలర్లు దాటిన బిట్ కాయిన్ 

మరోవైపు, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, నెస్లే షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో, బిట్‌ కాయిన్‌ విలువ రికార్డు స్థాయిలో లక్ష డాలర్లు దాటింది. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ సూచీ 0.38%, నాస్‌డాక్‌ సుమారు 1%, డోజోన్స్ 0.37% పెరిగాయి. అయితే, ఆసియా పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దక్షిణ కొరియాలో రాజకీయ పరిస్థితులు, అక్కడి కోస్పి సూచీ 0.44% నష్టాల్లో ఉందని కనిపిస్తోంది. జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ASX సూచీలు లాభాల్లో ఉన్నప్పటికీ, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 1% కుంగింది.