Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడింది.
వాణిజ్య యుద్ధ భయాలను క్రియేట్ చేసిన ట్రంప్ నుంచే ఒక సానుకూల నిర్ణయం వెలువడటంతో ఆసియాతో పాటు మన మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగడానికి ప్రధాన కారణమైంది.
సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 23,600 పాయింట్ల మార్కును దాటింది.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 1155 పాయింట్ల లాభంతో 78,342 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 23,685 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
కారణాలు ఇవీ:
సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్,అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ లాభాల్లో కొనసాగుతుండగా,జొమాటో,ఐటీసీ హోటల్స్,నెస్లే ఇండియా,బజాజ్ ఫిన్సర్వ్,టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మెక్సికో,కెనడాపై సుంకాల విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని వాయిదా వేయడం సూచీల లాభాలకు కారణమైంది. ఈ నిర్ణయం కారణంగా ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ లాభాల్లో కొనసాగుతున్నాయి.
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బలపడటం కూడా మరో కారణం.ఆల్టైమ్ కనిష్ఠం నుంచి మన రూపాయి 13 పైసల మేర కోలుకుంది. ప్రస్తుతం 86.98 వద్ద కొనసాగుతోంది.
రేట్ల కోతపై ఆర్బీఐ నుండి సానుకూల సంకేతాలు వస్తాయన్న అంచనాతో బ్యాంకింగ్,ఫైనాన్షియల్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు కూడా సూచీల ర్యాలీకి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.