NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన
    లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు బలంగా సాగుతున్నాయి.

    మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్‌ 280 పాయింట్లు పెరిగి, నిఫ్టీ 23,000 పాయింట్లకు ఎగువన కొనసాగింది.

    ముఖ్యంగా, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మదుపర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఉదయం 9:30 గంటల సమయానికి, సెన్సెక్స్‌ 274 పాయింట్లు పెరిగి 76,068 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 23,015 వద్ద ట్రేడవుతోంది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, జొమాటో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    వివరాలు 

    బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 77.31 డాలర్లు 

    అయితే, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 77.31 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2,770.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    సోమవారం భారీగా పతనమైన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం పాక్షికంగా కోలుకున్నాయి. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి.

    ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ.4,921 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.6,814 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. ₹6 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,150 దిగువన ట్రేడవుతున్న నిఫ్టీ  బిజినెస్
    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..సెన్సెక్స్‌ 720 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్ల నష్టం  బిజినెస్
    Stock Market : స్వల్ప లాభంతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025