Page Loader
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు
నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ కారణంగా సూచీలు తొలుత లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ, కొంత సమయం గడిచిన తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 83 పాయింట్ల నష్టంతో 74,018 వద్ద, నిఫ్టీ (Nifty) 41 పాయింట్లు తగ్గి 22,456 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్,జొమాటో,ఎన్టీపీసీ,బజాజ్ ఫిన్‌సర్వ్,ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

వివరాలు 

నష్టాల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు ధర 2,924.70 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.28 వద్ద స్థిరంగా ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.75 శాతం, డోజోన్స్ 1.14 శాతం, నాస్‌డాక్ 0.18 శాతం నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1.67 శాతం, షాంఘై 0.33 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.20 శాతం నష్టాల్లో కదలాడుతుండగా, జపాన్ నిక్కీ 0.29 శాతం లాభాల్లో ఉంది.