Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @22,482
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
దీంతో సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ (Sensex) 300 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ (Nifty) 22,500 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.
ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 105 పాయింట్లు పెరిగి 74,126 వద్ద, నిఫ్టీ (Nifty) 12 పాయింట్లు పెరిగి 22,482 వద్ద కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 71.01 డాలర్లు
ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 71.01 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2,953.80 డాలర్ల వద్ద కదలాడుతోంది. రూపాయి మారకం విలువ డాలర్తో 87.14 వద్ద కొనసాగుతోంది.
అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి.ఎస్అండ్పీ సూచీ 0.49 శాతం,నాస్డాక్ 1.22 శాతం లాభపడగా,డోజోన్స్ 0.20 శాతం నష్టపోయింది.
వివరాలు
₹1,628 కోట్ల విలువైన షేర్ల విక్రయం
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.14 శాతం, షాంఘై 0.09 శాతం,హాంకాంగ్ హాంగ్సెంగ్ 0.34 శాతం నష్టాల్లో కొనసాగుతుండగా,జపాన్ నిక్కీ 0.96 శాతం లాభాల్లో ఉంది.
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా ₹1,628 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా ₹1,510 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.