NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 
    నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు..

    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 21, 2025
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఐటీ రంగంలోని షేర్లలో విక్రయాలు సూచీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితంగా, ప్రారంభంలో నష్టాల్లోకి వెళ్లిన సూచీలు ప్రస్తుతం లాభం-నష్టాల మధ్య ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్నాయి.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 19 పాయింట్ల నష్టంతో 76,345 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ (Nifty) 1 పాయింట్ లాభంతో 23,183 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    నష్టాల్లో ట్రేడవుతున్న షేర్లు: 

    సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జొమాటో, టైటాన్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    లాభాల్లో ఉన్న షేర్లు:

    బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 72.29 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 3,039 డాలర్ల మార్క్‌ను దాటింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో 86.20 వద్ద కొనసాగుతోంది.

    వివరాలు 

    స్వల్ప నష్టాల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు 

    అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

    ఎస్‌అండ్‌పీ సూచీ 0.22 శాతం, నాస్‌డాక్ 0.33 శాతం నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    జపాన్ నిక్కీ స్వల్ప లాభంలో ఉంటే, హాంకాంగ్ హాంగ్‌సెంగ్, షాంఘై సూచీలు బలహీనంగా కదలాడుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. గురువారం నికరంగా రూ.3,239 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

    అదే సమయంలో, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,136 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ
    Operation Sindoor: భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అమెరికా

    స్టాక్ మార్కెట్

    Stock Market: మార్కెట్‌ను వదలని ట్రంప్ భయం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 75,555 .. నిఫ్టీ 22,546  బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కారణం బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025