Page Loader
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@23,200
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@23,200

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@23,200

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మూడో రోజు వరుసగా లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కానీ కొద్దిసేపటి పాటు ఒత్తిడికి లోనై ఆపై ఐటీ షేర్లలో కొనుగోలుతో సూచీలు పెరిగాయి. చివరకు సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 76,598.84 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది (క్రితం ముగింపు 76,532.96). కాసేపు లాభ నష్టాల మధ్య తిరిగిన సూచీ ఇంట్రాడేలో 76,401.13 వద్ద కనిష్ఠాన్ని చేరింది. ఫార్మా షేర్లలో కొనుగోలుతో సూచీ 76,962.88 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి, 226 పాయింట్ల లాభంతో 76,759 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 23,249 వద్ద ముగిసింది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 76.05 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, ఐటీసీ హోటల్స్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, జొమాటో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 76.05 డాలర్ల వద్ద ట్రేడవుతుంది, బంగారం ఔన్సు 2,788.60 డాలర్ల వద్ద కొనసాగుతోంది.