
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@ 24,800
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి.
సెన్సెక్స్ సుమారు 200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,800 స్థాయిని అధిగమించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ముడిచమురు ధరలు ఈ రోజు కొంత తగ్గాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 187.73 పాయింట్లు పెరిగి 81,549.60 వద్ద ట్రేడవుతోంది.
అదే సమయంలో నిఫ్టీ 48.65 పాయింట్ల లాభంతో 24,841.90 వద్ద కొనసాగుతోంది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడగా, 86.58 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
జూన్ టీన్త్ సెలవు కారణంగా గురువారం అమెరికా మార్కెట్లకు సెలవు
నిఫ్టీలో టాటా మోటార్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు బాగా రాణించాయి.
కాగా, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ షేర్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ధోరణి ప్రదర్శించాయి.
జపాన్లో నిక్కీ సూచీ 0.14 శాతం నష్టపోగా,ఆస్ట్రేలియాలోని ASX 200 సూచీ 0.61 శాతం నష్టాల్లో ఉంది.
అయితే హాంకాంగ్లో హాంగ్సెంగ్ సూచీ 0.56 శాతం, దక్షిణ కొరియాలో కోస్పి సూచీ 0.65 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
జూన్ టీన్త్ సెలవు కారణంగా గురువారం అమెరికా మార్కెట్లు మూసివుండటం గమనార్హం. అంతర్జాతీయంగా బ్రెంట్ ముడిచమురు ధర శుక్రవారం 2 శాతం తగ్గి 77.22 డాలర్లకు పడిపోయింది.