NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market:  నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 58 పాయింట్లు చొప్పున నష్టం 
    తదుపరి వార్తా కథనం
    Stock market:  నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 58 పాయింట్లు చొప్పున నష్టం 
    నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 58 పాయింట్లు చొప్పున నష్టం

    Stock market:  నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 58 పాయింట్లు చొప్పున నష్టం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 09, 2024
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి.

    రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి ప్రముఖ షేర్లు మార్కెట్ సూచీలపై ఒత్తిడి చూపించాయి.

    ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ నేపథ్యంలో సూచీలు రెండో రోజు కూడా నష్టాలను నమోదుచేసి, నిఫ్టీ 24,650 పాయింట్ల దిగువకు చేరుకుంది.

    సెన్సెక్స్ ఉదయం 81,602.58 పాయింట్ల వద్ద ప్రారంభమై, గత ముగింపుతో పోలిస్తే (81,709.12) నష్టాల్లో కనిపించింది.

    ఈ రోజు మొత్తం ఒడుదొడుకులను ఎదుర్కొన్న సెన్సెక్స్, ఇంట్రాడేలో 81,411.55 - 81,783.28 పాయింట్ల మధ్య మారింది.

    వివరాలు 

     బంగారం ఔన్సు ధర 2679 డాలర్లు 

    చివరికి 200.66 పాయింట్ల నష్టంతో 81,508.46 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 58.80 పాయింట్ల నష్టంతో 24,619.00 వద్ద స్థిరపడింది.

    డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా క్షీణించి 84.74 వద్ద ముగిసింది.

    సెన్సెక్స్ 30 సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా వంటి షేర్లు నష్టపోయాయి.

    ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడే ధోరణి కనబరిచాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.93 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 2679 డాలర్ల వద్ద కొనసాగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    సెన్సెక్స్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    స్టాక్ మార్కెట్

    Swiggy: స్టాక్ మార్కెట్ లోకి మరో బిగ్గెస్ట్ IPO.. స్విగ్గీ ఐపీవోకి సంబంధించిన కీలక సమాచారం స్విగ్గీ
    Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు వ్యాపారం
    Stock market today: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్‌ సూచీలు.. 24,200 దిగువకు నిఫ్టీ బిజినెస్

    సెన్సెక్స్

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్
    భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్
    నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత  స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025