Page Loader
Stock market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,600 ఎగువన నిఫ్టీ 
స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,600 ఎగువన నిఫ్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2024
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, దేశీయ సూచీలు సావధానంగా అడుగులు వేస్తున్నాయి. సెన్సెక్స్‌ ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా, నిఫ్టీ 24,600 స్థాయిని మించి కదలాడుతుంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్‌ 7 పాయింట్లు పెరిగి 81,515 వద్ద ట్రేడవుతోంది, అలాగే నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి రూ.24,626 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 కంపెనీలలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాలతో ట్రేడవుతుండగా, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

వివరాలు 

మిశ్రమంగా కొనసాగుతున్న ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71.91 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,690.70 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.78 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి, కాగా ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.54 శాతం నష్టంలో, జపాన్‌ నిక్కీ 0.9 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1.04 శాతం, షాంఘై 1.44 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.724 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినప్పుడు, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.1,648 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.