NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

    Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2025
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

    ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం వంటి ప్రధాన కంపెనీల షేర్ల విక్రయాలు మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి.

    ఫలితంగా, మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 22,900 కంటే తక్కువ వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి.

    ఉదయం 9:30 గంటల సమయానికి, సెన్సెక్స్ 309 పాయింట్లు కోల్పోయి 75,692 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు పడిపోయి 22,858 వద్ద ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    బంగారం ఔన్సు 2,946.10 డాలర్లు 

    సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్,హెచ్‌యూఎల్,ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, ఎన్టీపీసీ,టాటా స్టీల్, టాటా మోటార్స్,కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 75.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    బంగారం ఔన్సు 2,946.10 డాలర్ల వద్ద కదలాడుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి.

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి,అందులో ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.70% నష్టపోగా, జపాన్ నిక్కీ 0.41% తగ్గింది.

    హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.61% నష్టంతో కొనసాగుతుండగా,షాంఘై మార్కెట్ మాత్రం 0.48% లాభాల్లో ట్రేడవుతోంది.

    వివరాలు 

    ₹3,072 కోట్ల షేర్లను కొనుగోలుచేసిన దేశీయ సంస్థాగత మదుపర్లు 

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా ₹4,787 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) ₹3,072 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    మార్కెట్ ప్రారంభంలోనే నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు, సంస్థాగత పెట్టుబడిదారుల వ్యూహాలు మార్కెట్ కదలికలను ప్రభావితం చేసే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 9 పాకిస్తానీ విమానాలు ధ్వంసం.. ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి  ఆపరేషన్‌ సిందూర్‌
    Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ టాలీవుడ్
    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Mumbai Airport: పార్కింగ్ విషయంలో డ్రైవర్లు, ముంబై విమానాశ్రయ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ  ముంబై

    స్టాక్ మార్కెట్

    Stock Market: కూప్పకూలిన స్టాక్ మార్కెట్.. ₹10 లక్షల కోట్లు ఆవిరి బిజినెస్
    Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్ బిజినెస్
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 535 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభం  బిజినెస్
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025