NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
    23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు

    Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 18, 2025
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    అందువల్ల సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ ఫ్లాట్‌గా, నిఫ్టీ 23,000 మార్క్ కింద ట్రేడింగ్ ప్రారంభించాయి.

    ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 128 పాయింట్లు తగ్గి 75,864 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు కుంగి 22,877 వద్ద ఉన్నాయి.

    సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, టాటాస్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.96 

    టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎమ్ అండ్ ఎమ్, జొమాటో షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.96 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,922.20 డాలర్ల వద్ద కదలాడుతోంది.

    అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి.

    ఎస్ అండ్ పీ 500, డోజోన్స్, ఫ్లాట్‌గా ముగియగా, నాస్‌డాక్ 1 స్వల్ప లాభంతో ముగిసింది. ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు కూడా నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    నష్టాల్లో  ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 

    జపాన్ నిక్కీ, హాంకాంగ్ హాంగ్ సెంగ్, షాంఘై లాభాల్లో ట్రేడవుతుండగా, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ మాత్రం నష్టాల్లో కదలాడుతుంది.

    దేశీయ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) విక్రయాల పర్వం కొనసాగుతూనే ఉంది.

    ఎఫ్‌ఐఐలు సోమవారం నికరంగా రూ.3,938 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,760 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు

    స్టాక్ మార్కెట్

    Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్
    Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 780 పాయింట్లు పతనం, నిఫ్టీ 22,845 దిగువన బిజినెస్
    Stock Market: కూప్పకూలిన స్టాక్ మార్కెట్.. ₹10 లక్షల కోట్లు ఆవిరి బిజినెస్
    Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025