Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
అందువల్ల సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ ఫ్లాట్గా, నిఫ్టీ 23,000 మార్క్ కింద ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 128 పాయింట్లు తగ్గి 75,864 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు కుంగి 22,877 వద్ద ఉన్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, టాటాస్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
డాలర్తో రూపాయి మారకం విలువ 86.96
టెక్ మహీంద్రా, సన్ఫార్మా, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎమ్ అండ్ ఎమ్, జొమాటో షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.
డాలర్తో రూపాయి మారకం విలువ 86.96 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,922.20 డాలర్ల వద్ద కదలాడుతోంది.
అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి.
ఎస్ అండ్ పీ 500, డోజోన్స్, ఫ్లాట్గా ముగియగా, నాస్డాక్ 1 స్వల్ప లాభంతో ముగిసింది. ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు కూడా నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
వివరాలు
నష్టాల్లో ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్
జపాన్ నిక్కీ, హాంకాంగ్ హాంగ్ సెంగ్, షాంఘై లాభాల్లో ట్రేడవుతుండగా, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ మాత్రం నష్టాల్లో కదలాడుతుంది.
దేశీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) విక్రయాల పర్వం కొనసాగుతూనే ఉంది.
ఎఫ్ఐఐలు సోమవారం నికరంగా రూ.3,938 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,760 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.