NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / STOCK MARKETS : సూచీలకు 'అమెరికా ఫెడ్‌' జోష్‌..రూ.4లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద
    తదుపరి వార్తా కథనం
    STOCK MARKETS : సూచీలకు 'అమెరికా ఫెడ్‌' జోష్‌..రూ.4లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద
    సూచీలకు 'ఫెడ్‌' జోష్‌..రూ.4లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద

    STOCK MARKETS : సూచీలకు 'అమెరికా ఫెడ్‌' జోష్‌..రూ.4లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 14, 2023
    06:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఈ మేరకు సెన్సెక్స్‌ 929 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

    అమెరికా ఫెడ్‌ తీసుకున్న నిర్ణయం సూచీలకు నూతనోత్సాహాన్ని అందించింది.

    ఈ క్రమంలోనే వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, భవిష్యత్‌లో రేట్ల తగ్గింపు ఉంటుందని సంకేతాలు ఇవ్వడం లాంటివి భారీ లాభాలకు బాటలు వేసింది.

    ప్రధానంగా ఐటీ(IT), రియల్టీ షేర్ల(Realty Shares)లో కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఫలితంగా సూచీలు సెన్సెక్స్‌(Sensex), నిఫ్టీ(Nifty) సరికొత్త జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి.

    details

    900 పాయింట్లకుపైగా సెన్సెక్స్ జోరు

    స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్‌ 900 పాయింట్లకుపైగా లాభపడగా నిఫ్టీ 21,150 పాయింట్ల ఎగువస్థాయిలో నిలిచింది.

    మదుపరుల సంపదగా భావించే BSEలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ సుమారుగా రూ.4 లక్షల కోట్లకు పెరిగి మొత్తంగా రూ. 355 లక్షల కోట్లకు ఎగబాకింది.

    గురువారం ఉదయం ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్‌ 70,146 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఆసాంతం సూచీలు లాభాల్లోనే కొనసాగడం విశేషం.

    ఇంట్రాడేలో 70,110.75- 70,602.89 మధ్య కదలాడింది. చివరకు 929.60 పాయింట్ల లాభంతో 70,514.20 వద్ద ముగిసింది.

    DETAILS

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంేటే

    నిఫ్టీ సైతం 256.35 పాయింట్ల లాభంతో 21,182.70 వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకం విలువ 83.33గా ఉంది.

    అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర 75.63 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఔన్సు బంగారం ధర 2049 డాలర్లకు చేరుకుంది.

    ద్రవ్యోల్బణం కట్టడికి రేట్లు పెంచుతూ వచ్చిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా కీలక రేట్లలో మార్పులేమీ చేయలేదు.

    ఇక ద్రవ్యోల్బణం 2 శాతం లక్ష్యం కంటే ఎక్కువే ఉన్న కారణంగా కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. ఈ మేరకు విధాన రేట్లను ప్రస్తుతం 5.25-5.50 శాతం శ్రేణిలోనే ఉంచుతున్నట్లు వివరించింది.

    వరుసగా మూడోసారీ రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించింది. 2024లో 3విడతల్లో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న సంకేతాలను మాత్రం ఇచ్చింది.ఫలితంగా మార్కెట్లో జోష్‌ సంతరించుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్
    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్

    స్టాక్ మార్కెట్

    కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం వ్యాపారం
    మరింత లాభపడిన భారతీయ రూపాయి విలువ
    NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది అదానీ గ్రూప్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది బ్యాంక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025