NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు
    అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు

    Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 06, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

    అమెరికా ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యే సమయంలో మార్కెట్లు లాభాలు సాధించడం విశేషం. సెన్సెక్స్‌ 220 పాయింట్లకు పైగా పెరిగి ప్రారంభమవ్వగా, నిఫ్టీ 24,300 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

    ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 399 పాయింట్లు పెరిగి 78,875 వద్ద, నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 24,347 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.23 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ఫిన్‌ సర్వ్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాలతో నడస్తున్నాయి.

    Details

    నష్టాలను చవిచూసిన టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్

    టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలను చవి చూడడం గమనార్హం.

    బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు 2,744.80 డాలర్ల వద్ద ఉంది.

    అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. అయితే ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    జపాన్‌ నిక్కీ 2.25%, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.93%, షాంగై 2.12% లాభాలను నమోదు చేశాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 2.57% నష్టంతో కొనసాగుతుంది.

    మంగళవారం వీరు నికరంగా రూ.2,569 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు, అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,031 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    వ్యాపారం

    తాజా

    MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు ముంబయి ఇండియన్స్
    Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థను ఆవిష్కరించిన ట్రంప్  అమెరికా
    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్

    స్టాక్ మార్కెట్

    Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు  మధ్యంతర బడ్జెట్ 2024
    Paytm: భారీగా పేటీఎం షేర్ల పతనం.. రూ.26,000 కోట్ల ఆవిరి  పేటియం
    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Sensex : 75000 దాటిన సెన్సెక్స్,నిఫ్టీ సరికొత్త రికార్డు బిజినెస్

    వ్యాపారం

    IIT Bombay: ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్లలో కనీస వేతనం భారీగా తగ్గుదల  టెక్నాలజీ
    FY25కి భారతదేశ వృద్ధి అంచనాను 7శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంకు
    London: లండన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌పై సైబర్ దాడి  లండన్
    2025కి 6-సీటర్ మోడల్ Yని తయారు చేయనున్న టెస్లా  టెస్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025