
Stock Market: ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూచీలు కొద్దిసేపు లాభ-నష్టాల మధ్య ఊగిసలాడాయి.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 43 పాయింట్లు పెరిగి 75,345 వద్ద, నిఫ్టీ (Nifty) 15 పాయింట్లు పెరిగి 22,850 వద్ద ట్రేడవుతున్నాయి.
లాభాల్లో షేర్లు
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జొమాటో, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Details
నష్టాల్లో షేర్లు
టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 70.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,042 డాలర్ల మార్క్ను దాటి కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 86.67 వద్ద ఉంది.
అమెరికా మార్కెట్లు మంగళవారం బలహీనంగా ముగియగా, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
జపాన్ నిక్కీ, షాంఘై స్వల్ప లాభాలతో హాంకాంగ్ హాంగ్సెంగ్, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.
Details
ఎఫ్ఐఐలు, డీఐఐల కొనుగోళ్లు
విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) వరుసగా విక్రయదారులుగా వ్యవహరించిన తర్వాత మంగళవారం కొనుగోలుదారులుగా మారారు.
FIIs నికరంగా రూ.1,463 కోట్ల షేర్లను దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,028 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.