NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / JPMorgan CEO: జేపీ మోర్గాన్ సీఈఓ జానీ డిమోన్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బలమైన సంబంధాలు అవసరం..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    JPMorgan CEO: జేపీ మోర్గాన్ సీఈఓ జానీ డిమోన్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బలమైన సంబంధాలు అవసరం..
    జేపీ మోర్గాన్ సీఈఓ జానీ డిమోన్ కీలక వ్యాఖ్యలు..

    JPMorgan CEO: జేపీ మోర్గాన్ సీఈఓ జానీ డిమోన్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బలమైన సంబంధాలు అవసరం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 08, 2025
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన ''పరస్పర సుంకాల'' విధానాన్ని అమెరికా ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.

    ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా ఇటీవల ''హ్యాండ్స్ ఆఫ్'' అనే పేరుతో ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి.

    అమెరికా అంతటా అనేక నగరాల్లో నిరసనల జ్వాలలు ఎగిసిపడ్డాయి.

    మరోవైపు, ట్రంప్ విధించిన సుంకాలు అమలులోకి రాకముందే, అవసరమైన వస్తువులను ముందుగానే కొనుగోలు చేసేందుకు ప్రజలు సూపర్ మార్కెట్ల వద్ద గుమికూడారు.

    వివరాలు 

    జేమీ డిమోన్ ఆందోళన 

    JP మోర్గాన్ చేజ్ & కో సీఈఓ జేమీ డిమోన్, ట్రంప్ విధానాలపై అసహనం వ్యక్తం చేస్తూ వాటాదారులకు లేఖ రాశారు.

    ఆయన ఆ లేఖలో కొత్త వాణిజ్య సుంకాలపై తన ఆందోళనను వెల్లడించారు.ఈ విధంగా సుంకాలను విధించడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందని, దీని ప్రభావంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి లోనయ్యే అవకాశముందని హెచ్చరించారు.

    ట్రంప్ తాజా నిర్ణయాల వల్ల దిగుమతి చేసే వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో దేశీయ ఉత్పత్తులపై డిమాండ్ పెరిగితే వాటి ధరలు కూడా పెరగవచ్చని తెలిపారు.

    ఈ విధంగా తీసుకున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం మరింత వేగంగా పెరిగే అవకాశముంది.

    వివరాలు 

    ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం 

    మార్కెట్‌లో ఇప్పటికే చాలా మంది ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారని పేర్కొన్నారు.

    వాస్తవానికి వృద్ధి పూర్తిగా నిలిచిపోకపోయినా, ఈ సుంకాల ప్రభావం వల్ల ఆర్థిక రంగం నెమ్మదించే అవకాశముందని డిమోన్ తెలిపారు.

    వ్యయాలు పెరిగే కొద్దీ సంస్థలు ఆ భారం వినియోగదారులపై మోపే అవకాశం ఉందని, దీని వల్ల దేశీయ మార్కెట్‌లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

    ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, దేశీయంగా తయారు చేసే ఉత్పత్తులపై డిమాండ్ పెరగడం వలన కేవలం దిగుమతులకే కాకుండా, దేశీయ ధరలపై కూడా ద్రవ్యోల్బణ ప్రభావం చూపే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.

    వివరాలు 

    భారత్‌తో సంబంధాలు బలోపేతం చేయాలి 

    ఒకవైపు సుంకాలపై హెచ్చరికలు జారీ చేస్తూనే, డిమోన్ అమెరికా ప్రభుత్వానికి కీలక సలహా ఇచ్చారు.

    బ్రెజిల్, భారత్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం అవసరమని అన్నారు.

    అభివృద్ధి చెందుతున్న దేశాలతో-సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా అమెరికా గణనీయమైన లాభాలు పొందవచ్చని సూచించారు.

    ప్రస్తుతం అమెరికాకు తన ప్రాధాన్యమైన భాగస్వామ్య దేశాలతో సరైన వాణిజ్య ఒప్పందాలు లేవని ఆయన వివరించారు.

    ట్రంప్ సుంకాల విధానాల ప్రకారం ప్రస్తుతం అమెరికా భారత్‌పై 26 శాతం, బ్రెజిల్‌పై 10 శాతం సుంకాలు విధించిన విషయం కూడా ఆయన ప్రస్తావించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మోర్గాన్ స్టాన్లీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    మోర్గాన్ స్టాన్లీ

    'ఓవర్ వెయిట్‌' లో మార్గాన్ స్టాన్లీ రేటింగ్ పెంపు.. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగు ఇండియా
    Morgan Stanley: 2024లో భారత్‌ వృద్ధి రేటు అంచనా 6.8 శాతం.. మోర్గాన్ స్టాన్లీ  బిజినెస్
    Sensex: మోర్గాన్‌ స్టాన్లీ అంచనా.. వచ్చే ఏడాది సెన్సెక్స్‌ 1,05,000 పాయింట్లకు చేరే అవకాశాలు! సెన్సెక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025