NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్
    తదుపరి వార్తా కథనం
    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్
    ఇంటి నుండి పని చేయమని సిబ్బందిని ఆదేశించింది

    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 13, 2023
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో ఖర్చు తగ్గించే చర్యలను కొనసాగిస్తున్నారు. సింగపూర్‌లోని ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలోని సిబ్బందిని వారి డెస్క్‌లను క్లియర్ చేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని సంస్థ కోరింది.

    గురువారం నుండి ఇంటి నుండి పని చేయమని ఈ కార్యాలయ సిబ్బందిని ఆదేశించింది. అయితే మస్క్ రిమోట్ పని విధానానికి వ్యతిరేకి కానీ ఇప్పుడు ఈ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమనడం ఆసక్తికర చర్చకు దారితీసింది.

    బుధవారం సింగపూర్ కార్యాలయంలోని సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో, డెస్క్‌లను క్లియర్ ఖాళీ చేయడానికి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చింది. సింగపూర్ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయాలని కంపెనీ నిర్ణయించుకుందా లేదా అనేది ఇంకా తెలియలేదు.

    ట్విట్టర్

    అద్దె చెల్లించకపోవడంతో ట్విట్టర్ సింగపూర్ కార్యాలయం మూసివేత

    అద్దె చెల్లించకపోవడంతో ట్విట్టర్ సింగపూర్ కార్యాలయం మూసివేస్తున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నివేదికలపై స్పందించిన CapitaGreen యజమాని CapitaLand, ట్విట్టర్ సంస్థ నుండి అటువంటి ఇబ్బంది ఏమి లేదని తెలిపింది.

    ఈ సింగపూర్ కార్యాలయం కంపెనీ ఖర్చు తగ్గింపులో భాగంగా ఇటీవల ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సైట్ అధిపతి నూర్ అజర్ బిన్ అయోబ్‌ను తొలగించింది. తప్పుడు సమాచారం, గ్లోబల్ అప్పీల్స్, స్టేట్ మీడియాకు సంబంధించిన విధానాలపై పనిచేసే బృందాలలో ఉద్యోగులను కూడా తొలగించింది. ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ అనేక మంది ఉద్యోగులను ఈ కార్యాలయం నుండి తొలగించినట్లు ధృవీకరించారు.

    ఇటువంటి ఖర్చు తగ్గింపు చర్యలే కాకుండా సరికొత్త ఆదాయ మార్గాలను వెతకడంలో ట్విట్టర్ నిమగ్నమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్
    ఎలాన్ మస్క్

    తాజా

    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్

    ట్విట్టర్

    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్ టెక్నాలజీ
    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ఎలాన్ మస్క్
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు టెక్నాలజీ
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఎలాన్ మస్క్

    2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం టెక్నాలజీ
    భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం ట్విట్టర్
    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025