NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Vishal Mega Mart IPO: డిసెంబర్‌ 11 నుంచి ప్రారంభం కానున్న విశాల్‌ మెగామార్ట్‌ ఐపీఓ..₹8 వేల కోట్లు సమీకరణే లక్ష్యం 
    తదుపరి వార్తా కథనం
    Vishal Mega Mart IPO: డిసెంబర్‌ 11 నుంచి ప్రారంభం కానున్న విశాల్‌ మెగామార్ట్‌ ఐపీఓ..₹8 వేల కోట్లు సమీకరణే లక్ష్యం 
    డిసెంబర్‌ 11 నుంచి ప్రారంభం కానున్న విశాల్‌ మెగామార్ట్‌ ఐపీఓ

    Vishal Mega Mart IPO: డిసెంబర్‌ 11 నుంచి ప్రారంభం కానున్న విశాల్‌ మెగామార్ట్‌ ఐపీఓ..₹8 వేల కోట్లు సమీకరణే లక్ష్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 05, 2024
    02:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గురుగ్రామ్‌ కేంద్రంగా దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లను నిర్వహించే విశాల్‌ మెగామార్ట్‌ తన తొలి పబ్లిక్‌ ఇష్యూను (Vishal Mega Mart IPO) ప్రకటించింది.

    ఈ ఐపీఓ ద్వారా మార్కెట్‌ నుంచి రూ. 8 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    డిసెంబర్‌ 11న ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 13న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం డిసెంబర్‌ 10న బిడ్డింగ్‌ విండో ప్రారంభం అవుతుంది. ఐపీఓ ధరలు ఇంకా వెల్లడికాలేదు.

    ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) రూపంలో జరుగుతుంది. సమయత్‌ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌పీ, విశాల్‌ మెగామార్ట్‌ ప్రమోటర్‌ సంస్థ, ఈ ఐపీఓ ద్వారా తన వాటాలను విక్రయించనుంది.

    వివరాలు 

    దేశవ్యాప్తంగా 626 స్టోర్లు 

    ప్రస్తుతం ఈ సంస్థకు విశాల్‌ మెగామార్ట్‌లో 96.55 శాతం వాటా ఉంది.

    కొత్తగా షేర్లు జారీ చేయడం లేదు, అంటే మార్కెట్‌ నుంచి సమీకరించిన మొత్తం నిధులు ఆ సంస్థ వాటాదారులకు మాత్రమే చేరుకుంటాయి.

    ఈ పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి కాన్ఫిడెన్షియల్‌ మార్గంలో దరఖాస్తు చేయగా, సెప్టెంబర్‌ 25న గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

    విశాల్‌ మెగామార్ట్‌ ప్రధానంగా మధ్య, దిగువ మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వివిధ నగరాల్లో స్టోర్లు స్థాపించింది.

    2024 జూన్‌ 30 నాటికి దేశవ్యాప్తంగా 626 స్టోర్లను ఏర్పాటు చేసింది.

    వివరాలు 

    మొబైల్‌ యాప్‌,వెబ్‌సైట్‌ ద్వారా కూడా విక్రయాలు 

    మొబైల్‌ యాప్‌,వెబ్‌సైట్‌ ద్వారా కూడా విక్రయాలు జరుగుతున్నాయి.

    తమ రిటైల్‌ స్టోర్లలో ఇన్‌హౌస్‌, థర్డ్‌ పార్టీ బ్రాండ్లను విక్రయిస్తోంది. దుస్తులు, జనరల్‌ ఉత్పత్తులు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు ఈ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.

    ఈ పబ్లిక్‌ ఇష్యూకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఇంటెన్సివ్‌ ఫిస్కల్‌ సర్వీసెస్‌, జెఫ్రీస్‌ ఇండియా, జేపీ మోర్గాన్‌ ఇండియా, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా పనిచేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఓ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఐపీఓ

    Tata Tech IPO: అదరగొట్టిన టాటా ఐపీఓ.. నిమిషాల్లోనే సబ్‌స్క్రిప్షన్ ఫుల్  టాటా
    Ixigo :శుభారంభాన్నిచ్చిన ఇక్సిగో IPO ట్రావెల్  బిజినెస్
    భారత్‌లో SHEIN ఐపీఓను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    Hyundai IPO: పూర్తైన హ్యుందాయ్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ .. క్యూఐబీ కోటా నుంచి అత్యధిక బిడ్లు హ్యుందాయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025