NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!
    యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!

    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 01, 2025
    09:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నగదు రహిత లావాదేవీల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌లు వినియోగదారులను ఆకర్షించేందుకు నూతన సేవలను అందిస్తున్నాయి.

    ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలో ఎన్ని నగదు నిల్వలు ఉన్నాయో తెలుసుకోవడం ప్రధాన సౌకర్యంగా నిలుస్తోంది.

    దీంతో బ్యాంకు శాఖలకు లేదా ఏటీఎంలకు వెళ్లే అవసరం లేకుండానే, చాలా మంది రోజులో ఎన్నోసార్లు యూపీఐ యాప్‌ల ద్వారానే తమ ఖాతా నిల్వను పరిశీలిస్తున్నారు.

    అయితే ఈ తరచూ జరిగే బ్యాలెన్స్ తనిఖీల వల్ల నెట్‌వర్క్‌పై భారం పెరుగుతోంది.

    దీన్ని తగ్గించేందుకు, వినియోగదారులకు మెరుగైన, అంతరాయం లేని సేవలు అందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొన్ని పరిమితులను విధించబోతోంది.

    Details

    ప్రతి యాప్‌కి 50 సార్లు చొప్పున తనిఖీ

    ఈ మేరకు బ్యాంకులు, యూపీఐ సేవల సంస్థలకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.

    ఈ నూతన మార్పుల ప్రకారం, వినియోగదారులు రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాలెన్స్‌ను యూపీఐ యాప్ ద్వారా తనిఖీ చేయగలరు.

    ఒకరు రెండు యూపీఐ యాప్‌లు వాడుతున్నట్లయితే, ప్రతి యాప్‌కి 50 సార్లు చొప్పున తనిఖీ చేసే వీలుంటుంది.

    అలాగే, విజయవంతమైన లావాదేవీ తర్వాత ఖాతాలో మిగిలిన బ్యాలెన్స్‌ను వినియోగదారులకు చూపించాలన్న ఆదేశాలు బ్యాంకులకు జారీ అయ్యాయి.

    అంతేగాక ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేసెస్) ఆధారిత లావాదేవీలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు వినియోగదారుల అనుమతితోనే జరగాలని సూచించారు.

    Details

    ఆగస్టు 1 నుంచి అమలు

    ఇక ఆటోమేటెడ్ చెల్లింపులు ఉదాహరణకు SIPలు, ఓటీటీ సేవల చందాల వంటి రకాల చెల్లింపులు.

    రద్దీ లేని సమయాల్లోనే ప్రాసెస్ చేయాలని, రద్దీ సమయంలో చెల్లింపు అభ్యర్థన మాత్రమే తీసుకొని, చెల్లింపును తక్కువ ట్రాఫిక్ ఉన్న సమయంలో చేయాలని స్పష్టం చేశారు.

    ఈ కొత్త మార్పులు 2025 ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది.

    వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు, వ్యవస్థలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలు కీలకమవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యూపీఐ

    తాజా

    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్

    యూపీఐ

    UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌  యూపీఐ పేమెంట్స్
    UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి  యూపీఐ పేమెంట్స్
    New Year 2024 : ఈ ఏడాది యూపీఐ, వడ్డీ రేట్లు, సిమ్ కార్డ్స్ విషయంలో వచ్చే కీలక మార్పులు ఇవే యూపీఐ పేమెంట్స్
    UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు! ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025