
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్ తయారీదారుగా టాటా గ్రూప్
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు సమీపంలోని అసెంబ్లింగ్ ప్లాంట్ విక్రయానికి Wistron Corp ఆమోదం తెలిపిన తర్వాత టాటా గ్రూప్ త్వరలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్ను తయారు చేయనుంది.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రకటించారు. దింతో బాటుగా కేంద్ర మంత్రి విస్ట్రాన్ జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనను జతపరిచారు.
విస్ట్రోన్ ఇన్ఫోకామ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ను టాటాకు $125 మిలియన్లకు విక్రయించడానికి బోర్డు ఆమోదాన్ని కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో ధృవీకరించింది.
దింతో భారతదేశంలో ఐఫోన్లను తయారు చేసే మొదటి భారతీయ సంస్థగా టాటా గ్రూప్ అవతరించనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్
PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports.
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023
Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL