NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / World Bank: పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల వృద్ధి.. ప్రపంచ బ్యాంకు నివేదిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    World Bank: పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల వృద్ధి.. ప్రపంచ బ్యాంకు నివేదిక
    పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల వృద్ధి.. ప్రపంచ బ్యాంకు నివేదిక

    World Bank: పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల వృద్ధి.. ప్రపంచ బ్యాంకు నివేదిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2025
    11:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ఉపాధి రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది.

    2021-22 నుండి దేశ కార్మిక మార్కెట్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని, పని చేయగల జనాభా కంటే వేగంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొంది.

    మహిళల శ్రామిక శక్తిలో పాల్గొనడం పెరుగుతున్నది కూడా ప్రత్యేకంగా హైలైట్‌ చేసింది. మూడేళ్లుగా ఉద్యోగాల వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని వెల్లడించింది.

    2017-18 ఆర్థిక సంవత్సరం తర్వాత నిరుద్యోగ స్థాయి క్రమంగా తగ్గి 2021-22 నాటికి 6.6 శాతానికి చేరిందని తెలిపింది. ఇది కరోనా అనంతరం ఉపాధి పునరుద్ధరణకు సూచికగా పేర్కొంది.

    గణనీయంగా మారిన మరో అంశం వలసల ప్రభావం.

    Details

    ప్రపంచ బ్యాంకు ఆందోళన

    గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉద్యోగాల కోసం పట్టణాలకు వలసవస్తుండటంతో పురుషుల వలస రేటు పెరిగిందని పేర్కొంది. ఇదే సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ రంగంలో అధికంగా ప్రవేశిస్తున్నారని వివరించింది.

    అయితే మహిళల ఉద్యోగాల్లో వృద్ధి ఉన్నప్పటికీ వేతనాల్లో లింగ అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది.

    అయితే ఉపాధి వృద్ధి ఉన్నా నిరుద్యోగ యువత రేటు పెరుగుతుండటంపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తంచేసింది.

    భారత్‌లో యువ నిరుద్యోగిత 13.3 శాతంగా ఉందని, ఉన్నత విద్య పూర్తిచేసిన వారిలో 29 శాతం మంది ఇంకా ఉద్యోగం కోసం వెతుకుతున్నారని పేర్కొంది.

    Details

    పేద రాష్ట్రాలుగా బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్

    పేదరికం కాస్త తగ్గినప్పటికీ ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఇంకా అత్యంత పేద రాష్ట్రాలుగా ఉన్నాయని వివరించింది.

    ఈ నేపథ్యంలో, స్థిరమైన ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడుల వృద్ధి ద్వారా మాత్రమే ఉపాధి రంగాన్ని మరింత బలోపేతం చేయచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచ బ్యాంకు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ప్రపంచ బ్యాంకు

    FY25కి భారతదేశ వృద్ధి అంచనాను 7శాతానికి పెంచిన ప్రపంచ బ్యాంకు వ్యాపారం
    Amaravati: రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణం.. నవంబరులో నిర్మాణ పనుల ప్రారంభం అమరావతి
    Poorest countries: ప్రపంచంలోని 26 పేద దేశాల అప్పులు 18 ఏళ్ల గరిష్టానికి చేరాయి: ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగా
    World bank: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025