Page Loader
Mollywood : మాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. మమ్ముట్టి-మోహన్‌లాల్ కలయికలో బిగ్ బడ్జెట్ మూవీ
మాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. మమ్ముట్టి-మోహన్‌లాల్ కలయికలో బిగ్ బడ్జెట్ మూవీ

Mollywood : మాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్.. మమ్ముట్టి-మోహన్‌లాల్ కలయికలో బిగ్ బడ్జెట్ మూవీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2024
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

మాలీవుడ్ సినిమా చరిత్రలో అపూర్వ కాంబినేషన్‌గా మెగాస్టార్ మమ్ముట్టి, కంప్లీట్ స్టార్ మోహన్‌ లాల్‌ కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్‌ను పంచుకోనున్నారు. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలతో పాటు, ప్రముఖ నటులు ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సి.ఆర్. సలీం, సుభాష్ జార్జ్ మాన్యువల్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Details

మాలీవుడ్ అభిమానుల్లో ఉత్కంఠ

శ్రీలంకలో గ్రాండ్‌గా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో పాటు కుంచాకో బోబన్, రాజేష్ కృష్ణ, సలీం షార్జా పాల్గొన్నారు. కెమెరా స్విచ్ ఆన్‌ని సుభాష్ జార్జ్ ప్రారంభించగా, సి.ఆర్. సలీం తొలి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్‌బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, దిల్లీ, కొచ్చి వంటి విభిన్న లొకేషన్‌లలో 150 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. మలయాళం సినీ చరిత్రలో ఇదొక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై మాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్ కలయికలో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.