LOADING...
Aaradhya Bachchan: 'ఇక లేరు' కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఆరాధ్య బచ్చన్
'ఇక లేరు' కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఆరాధ్య బచ్చన్

Aaradhya Bachchan: 'ఇక లేరు' కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఆరాధ్య బచ్చన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్‌-అభిషేక్‌ బచ్చన్‌ల కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ తన ఆరోగ్యంపై కొన్ని వెబ్‌సైట్‌లలో ప్రచురించిన తప్పుడు కథనాలను తొలగించాలని కోరుతూ మరోసారి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ సందర్భంగా, న్యాయస్థానం గూగుల్‌కు నోటీసులు ఇచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికలు పాటించకపోవడంతో ఆరాధ్య రెండోసారి పిటిషన్ వేశారు. ఆరాధ్య బచ్చన్‌ మీద ఉన్న అనారోగ్యంతో సంబంధించి, "ఇక లేరు" అంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో చేసిన ప్రకటనలపై ఆమె, ఆమె తండ్రి అభిషేక్‌ బచ్చన్‌ రెండేళ్ల క్రితం వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే.

Details

తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా

విచారణ సందర్భంగా కోర్టు ఈ చర్యకు తీవ్రంగా స్పందించింది. ప్రతి చిన్నారిని గౌరవంగా చూడాలని, పిల్లల ఆరోగ్యం సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడం చట్టం ప్రకారం తప్పు అని పేర్కొంది. గూగుల్‌ను ఆదేశించి, ఆ వీడియోలను యూట్యూబ్‌ వేదిక నుంచి తొలగించాలని కోర్టు సూచించింది. ఇక ఈ తక్షణ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి 17న జరగనుంది.