
PuriSethupathi: పూరి సేతుపతి సినిమా కోసం.. మరో నిర్మాత
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో కలసి ఓ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల విడుదలైన "డబుల్ ఇస్మార్ట్" సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా హిట్ కొట్టాలని పూరి సంకల్పించుకున్నాడు. అందుకే విజయ్ సేతుపతితో రూపొందించే ఈ చిత్రానికి ఒక బలమైన కథను సిద్ధం చేసినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. పూరిజగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఇది తొలి సినిమా కావడంతో, దీనిపై అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి టబూ,కన్నడ నటుడు దునియా విజయ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి సరసన నాయికగా సంయుక్త మీనన్ నటించబోతున్నారు.
వివరాలు
ఈ చిత్రానికి విష్ణు రెడ్డి సీఈఓ
ఇప్పటికే ఆమెను హీరోయిన్గా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం.ఈచిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి కౌర్,పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈక్రేజీ ప్రాజెక్ట్లో ఇంకొక నిర్మాత కూడా భాగస్వామిగా చేరారు. జేబీ మోషన్ పిక్చర్స్ అధినేత జెబి నారాయణ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆయన పూరి కనెక్ట్స్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే భారీ నటుల కాస్టింగ్తో రూపొందుతున్నఈ చిత్రానికి విష్ణు రెడ్డి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో చిత్రబృందం నిమగ్నమై ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు,ఈ చిత్రానికి టైటిల్ విషయంలో 'బెగ్గర్'.'భవతి బిక్షాం దేహి' అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం లభిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూరి కనెక్టస్ చేసిన ట్వీట్
Two powerhouses. One explosive vision 🔥@PuriConnects collaborates with #JBMotionPictures for the most ambitious project #PuriSethupathi ❤️🔥
— Puri Connects (@PuriConnects) June 30, 2025
Produced by Puri Jagannadh, Charmme Kaur and #JBNarayanRaoKondrolla 💥
Presented by @Charmmeofficial
CEO @IamVishuReddy
Releases in… pic.twitter.com/5v98L4TMUn