
squid game 3: 'స్క్విడ్ గేమ్3' గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
డబ్బు కోసం మనిషి ప్రతిరోజూ పరితపిస్తూ ఉంటాడు. జీవితం అంతా ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ పోరాడుతూనే ఉంటుంది. డబ్బు వస్తుందంటే ప్రాణాలకు తెగిస్తాడు.. అదే డబ్బు లేకపోతే, ప్రాణాలనే విడిచిపెడతాడు. అందుకే "ధనం మూలం ఇదం జగత్" అని అన్నారు. సంపాదన కోసం తమ ప్రాణాలకే పణంగా పెట్టి కొంతమంది ఆడిన ప్రమాదకరమైన ఆటే 'స్క్విడ్ గేమ్'. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించిన ఈ వెబ్సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఇది మూడో సీజన్తో మళ్లీ రాబోతుంది. జూన్ 27వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా 'స్క్విడ్ గేమ్'కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు...
వివరాలు
'స్క్విడ్ గేమ్'కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..
అప్పులపాలై జీవితం మొత్తం కోల్పోయిన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్లి, చిన్నపిల్లలు ఆడే ఆటల రూపంలో పోటీలు నిర్వహిస్తారు. ఈ ఆటలు మొదట కనిపించడానికి సాధారణంగానే అనిపించినా, ఓడిపోతే వారిని హతమార్చేస్తారు. చరిత్రలోనూ ప్రాణాలను బలిగా తీసే ఆటల ఆధారంగా వినోదం అనే పేరు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ సిరీస్లో కీలకమైన పాత్ర అయిన ప్లేయర్ నెంబర్ 456గా కనిపించే జి-హున్ పాత్ర దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ నిజజీవిత అనుభవాలతో ప్రేరణ పొందింది. ఆయన 16 సంవత్సరాలు డ్రాగన్ మోటార్స్లో పనిచేశాడు. అక్కడ ఉద్యోగులతో కలిసి నిరసన చేపట్టడంతో, తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తరువాత ఎన్నో కష్టాలకో గురయ్యాడు.
వివరాలు
'స్క్విడ్ గేమ్'కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..
ఈ కథను తీసుకెళ్లేందుకు డాంగ్ హ్యుక్ దాదాపు పదేళ్ల పాటు వివిధ ప్రొడక్షన్ కంపెనీలు, మీడియా సంస్థల చుట్టూ తిరిగాడు. ఈ సిరీస్లో చూపించిన దీవి నిజంగానే ఉండేది. 1970-1980 కాలంలో బుసాన్లోని "బ్రదర్స్ హోం" అని పిలిచే ఈ ప్రదేశంలో సుమారు 20 ఫ్యాక్టరీలు పనిచేస్తుండేవి. ఇతర ప్రాంతాల నుంచి బలవంతంగా మనుషులను తీసుకొచ్చి కష్టతరమైన పనులకు ఉపయోగించేవారు. తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ వెట్టి చాకిరి వ్యవస్థను ముగించింది.
వివరాలు
'స్క్విడ్ గేమ్'కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..
స్క్విడ్ గేమ్లో ఉపయోగించిన ఫోన్ నంబర్ కూడా వాస్తవమైనదే. కానీ ఇందులో 8 అంకెలే ఉన్నాయి. సిరీస్ విడుదలైన తర్వాత కొంతమంది ఆ నంబర్కు ఫోన్ చేయగా, ముందు "010" అనే కోడ్ కలిపి కాల్ వెళ్లింది. ఫలితంగా ఆ నెంబర్కు చెందిన వ్యక్తికి రోజుకు నాలుగు వేలకు పైగా కాల్స్ వచ్చాయని సమాచారం. మొదటి సీజన్లో కనిపించిన పాకిస్థానీ పాత్రలో నటించిన అనుపమ్ త్రిపాఠి అసలైన భారతీయుడు. కానీ ఆయన కొరియన్ భాషను చాలా స్పష్టంగా మాట్లాడగలడు. ఈ సిరీస్లో మనుషులను సమాధి పెట్టే పెట్టెలు గిఫ్ట్ ప్యాకులా కనిపించాలన్న ఆలోచన ప్రొడక్షన్ డిజైనర్ క్యుంగ్-సన్ది."ఈ ఆటల్లో పాల్గొంటున్న మనుషులు దేవుడు ఇచ్చిన బహుమతులు" అనే భావన నుంచి ఇది రూపొందించబడింది.
వివరాలు
'స్క్విడ్ గేమ్'కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..
దక్షిణ కొరియాలో పేద, ధనిక మధ్య ఉన్న విభేదాన్ని చూపించడానికి ఈ సిరీస్లో అనేక సూచనలుంటాయి. ముఖ్యంగా, జి-హున్ తల్లి వృద్ధురాలైనా కూడా వీధిలో వ్యాపారం చేస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే 1990 వరకు అక్కడ రిటైర్మెంట్ వ్యవస్థ సరిగా అమలులోకి రాలేదు. దాంతో వృద్ధులు తమ జీవనోపాధి కోసం చివరి వరకు పనిచేయాల్సి వచ్చేది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, నెట్ ఫ్లిక్స్కు ఈ సిరీస్ దాదాపు ఒక బిలియన్ డాలర్ల స్థాయిలో ప్రచారాన్ని తీసుకొచ్చిందట.
వివరాలు
'స్క్విడ్ గేమ్'కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..
రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఆటలో, ప్లేయర్ నెంబర్ 1 అందరి కంటే ముందుగా కదులుతున్నప్పటికీ ఆ ఆటలోని బొమ్మ అతడిని స్కాన్ చేయదు. ఇది చాలా మంది గమనించని విశేషం. ఈ ఆటలన్నింటి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ వృద్ధుడు మార్బుల్ (గోలీలాట) గేమ్లో కావాలనే ఓడిపోతాడు. ఎందుకంటే తర్వాత వచ్చే గ్లాస్ గేమ్ చాలా శారీరక శ్రమతో కూడినది, అందులో ప్రాణాపాయం ఎక్కువ. అందుకే తాను మరణించక తప్పదన్న భావనతో ముందే ఓడిపోతాడు. అదే సమయంలో అతడి అసలు స్వరూపం బయటపడుతుంది.
వివరాలు
'స్క్విడ్ గేమ్'కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు..
మొదటి ఆట ముగిసిన తర్వాత అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలో ప్లేయర్ నెంబర్ 119 "ఇలాంటివి చెయ్యడం తప్పు. డబ్బు ఆశ చూపి మనుషుల్ని చంపడం అన్యాయం. మిమ్మల్ని పోలీసులు వదిలిపెట్టరు" అని అంటాడు. 119 అనే సంఖ్య దక్షిణ కొరియాలో పోలీసుల అత్యవసర కాల్ నంబర్. స్క్విడ్ గేమ్ సీజన్-1 విడుదలైన ఏడాది నెట్ఫ్లిక్స్లో అత్యధికంగా వీక్షించబడిన కొరియన్ డ్రామాగా నిలిచింది. అంతేకాదు, వరుసగా 10 వారాల పాటు "మోస్ట్ వాచ్డ్" టీవీ షోగా నిలిచింది.