
SC, ST Controversy : గిరిజనులను అవమానించారంటూ విజయ్ దేవరకొండపై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల సూర్య నటించిన 'రెట్రో' ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ, తన ప్రసంగంలో గిరిజనులను తీవ్రవాదులతో పోల్చేలా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ కామెంట్స్ గిరిజనుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపిస్తూ గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్య నటించిన 'రెట్రో' సినిమా ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు మాకెంతో అవమానకరం.
Deails
గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు
'500 సంవత్సరాల క్రితం వారు (గిరిజనులు) బుద్ధిలేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు' అని అన్నారు. అంతేకాకుండా మమ్మల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలు మాది గిరిజనుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా నెరిపే విధంగా ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలు SC/ST అట్రాసిటీ చట్టం, 1989 ప్రకారం శిక్షార్హం. కావున విజయ్ దేవరకొండపై తక్షణమే SC/ST అట్రాసిటీ కేసును నమోదు చేసి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము న్యాయం కోరుతున్నాము.' ఈ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసును నమోదు చేశారు.