
Chiranjeevi : మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ.. అభిమానుల్లో ఉత్సాహం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్తో ఏ తరం అయినా ప్రేరణగా నిలుస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠతో 'విశ్వంభర' అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నటిస్తుండగా, దర్శకుడు అనిల్ రావిపూడితో మరో మాస్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమా కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు ఓటిటి రంగంలో హోస్ట్గానో, నటులుగానో రాణించి, ఓటీటీ ఆడియెన్స్తో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. కానీ ఇప్పటివరకు చిరంజీవి మాత్రం ఓటీటీ ప్రాజెక్టులకు అంగీకారం తెలపలేదు.
Details
మంచి కథ ఉంటే సిద్ధమే
తాజాగా 'కుబేర' ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు 'ది ఫ్యామిలీ మాన్' వంటి ప్రముఖ వెబ్ సిరీస్ అవకాశం వచ్చిందన్నారు. కానీ అప్పట్లో టైమ్, కథ సరిపోక రిజెక్ట్ చేశానని వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితి మారిందని, సరియైన పాత్ర, మంచి కథ ఉంటే ఓటీటీ కోసం సిద్ధమని స్పష్టం చేశారు. మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తింది. చిరంజీవిని ఓ వెబ్ సిరీస్ లేదా ఓటీటీ మూవీలో చూడాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తలానే భావిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.