Bhimaa: మహాశివరాత్రికి రానున్న గోపీచంద్ భీమా
టాలీవుడ్ నటుడు గోపీచంద్,కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వంలో రానున్న యాక్షన్-ప్యాక్డ్ డ్రామా భీమా. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్,మాళవిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని ఫిబ్రవరి 16 నుండి మార్చి 8 కి రీషెడ్యూల్ చేసారు మేకర్స్. ఈ అప్డేట్ ని వెల్లడించడానికి,మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతానికి,ఈ చిత్రం రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్,విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో క్లాష్ కానుంది. ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్కి చెందిన కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.కెజిఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.