
Kannappa Movie: మంచు విష్ణు పేరు చెప్పకుండా.. 'కన్నప్ప' టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంచు మనోజ్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న 'కన్నప్ప' చిత్ర బృందానికి ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా విజయవంతమవాలని కోరుకుంటూ, ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మనోజ్ చేసిన ట్వీట్
All the best to Team #Kannappa!
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025
My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.
Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.
So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx
వివరాలు
ఎక్స్వేదికగా మంచు మనోజ్
"'కన్నప్ప' మూవీ బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రాజెక్టు కోసం నాన్నగారూ, ఆయన బృందమూ ఎన్నో సంవత్సరాల పాటు అపారమైన శ్రమను,ప్రేమను పెట్టారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవాలని ప్రార్థిస్తున్నాను. మా చిన్నారులు అరి,వివి,అవ్రామ్కి సంబంధించిన అందమైన జ్ఞాపకాలను వెండితెరపై చూడబోతున్నందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను. గొప్ప రచయిత తనికెళ్ల భరణి గారి జీవితకాల కలకు ఈ సినిమాతో ఊపిరి పోసినట్టుగా ఉంది.ఇక శుక్రవారం విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి మనసున్న ప్రభాస్, అలాగే మహానటులు మోహన్లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా లాంటి ప్రతిభావంతులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు.
వివరాలు
ఎక్స్వేదికగా మంచు మనోజ్
ఈ సినిమాకు వీళ్లందరూ చేసిన సహాయం, చూపిన ప్రేమ, పెట్టిన నమ్మకం అద్భుతమైనవి. ఇక తక్షణమే సినిమా చూడాలన్న ఆసక్తి నాలో రాజుకుంటోంది. ఈ సినిమా ప్రయాణానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." - అని ఎక్స్ వేదికగా మంచు మనోజ్ పేర్కొన్నారు.
వివరాలు
తిన్నడుగా విష్ణు
అయితే, మనోజ్ చేసిన ఈ పోస్ట్లో తన సోదరుడు,ఈ చిత్ర కథానాయకుడు మంచు విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ 'కన్నప్ప' బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర పేరు తిన్నడు.హీరోయిన్గా ప్రీతి ముకుందన్ నటించారు. జూన్ 27న ఈ చిత్రం తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ,హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. సెన్సార్ పూర్తయిన తర్వాత,ఈ సినిమా నిడివి 182 నిమిషాలుగా (అంటే 3 గంటల 2 నిమిషాలు) ఉన్నట్లు వెల్లడైంది.