
Naga Chaitanya : నాగ చైతన్య-శివ నిర్వాణ కాంబో రీ ఎంట్రీ.. 25వ మూవీ ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
నాగ చైతన్య హీరోగా, సమంత హీరోయిన్గా వచ్చిన సూపర్హిట్ చిత్రాలలో 'మజిలీ'కి ప్రత్యేక స్థానం ఉంది. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. చైతన్య కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలవడమే కాకుండా, తెరపై నాగ చైతన్య-సమంత భార్యాభర్తలుగా నటించిన చివరి సినిమాగా మజిలీ గుర్తింపు పొందింది. తాజా వార్త ఏంటంటే, 'మజిలీ' దర్శకుడు శివ నిర్వాణ మళ్లీ నాగ చైతన్యని హీరోగా పెట్టి కొత్త సినిమా రూపొందించనున్నాడు. శివ ఇటీవలే నాగ చైతన్యని కలసి ఒక కథ వినిపించాడు.
Details
త్వరలో అధికారిక ప్రకటన
పాయింట్ నచ్చడంతో నాగ చైతన్య వెంటనే శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. శివ నిర్వాణ ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. నాగ చైతన్య కెరీర్లో మైల్స్టోన్ 25వ సినిమాగా రానున్న ఈ చిత్రం ఫీల్గుడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉండబోతోందని సమాచారం. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ని నిర్మించనుంది.
Details
ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం
ఈ ఏడాది చివరి నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 'టక్ జగదీష్', 'ఖుషి'లాంటి సినిమాలతో వరుసగా ప్లాప్లను ఎదుర్కొన్న శివ నిర్వాణ, నాగ చైతన్యతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్తో సూపర్హిట్ కొట్టాలని తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇక నాగ చైతన్య కూడా ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడితో చేస్తున్న సినిమాను పూర్తి చేసి, శివ నిర్వాణ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.