Operation Valentine: పూల్వమా అమరవీరులకు "ఆపరేషన్ వాలెంటైన్" టీం నివాళి
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా "ఆపరేషన్ వాలెంటైన్" మార్చ్ 1న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా,భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కింది. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రుహని శర్మ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచుకున్నప్పటికీ,చాలా సార్లు వాయిదా పడడంతో ఆపరేషన్ వాలెంటైన్ పై ఉన్నక్రేజ్ కాస్త తగ్గింది.
ఢిల్లీ లో ఇంటర్వ్యూలు అయ్యాక హైదరాబాద్
తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ పూల్వమాలో అమరవీరుల స్థూపం దగ్గరకు నివాళులు అర్పించారు. ఆపరేషన్ వాలెంటైన్ టీం శ్రీ నగర్ లో పుల్వామా మెమోరియల్ సైట్ కి వెళ్లారు. ఇక ఆపరేషన్ వాలెంటైన్ టీమ్ ఈ పర్యటన ముగించుకున్నాక ఢిల్లీ లో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి హైదరాబాద్ కి చేరుకునే అవకాశం ఉంది.