
Samantha: 'ఆపండి ప్లీజ్'!.. ఫొటోగ్రాఫర్లపై సమంత ఆగ్రహం: వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ముంబయిలో జిమ్ సెంటర్ బయట ఫోటోగ్రాఫర్ల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
జిమ్ వ్యాయామం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ఫోన్లో మాట్లాడుతుండగా ఫోటోగ్రాఫర్లు ఫొటోలు తీయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫొటోలకు నిరాకరణ
జిమ్ నుంచి బయటికొచ్చిన సమంత, వైన్ కలర్ జిమ్ వేర్లో ఫోన్లో ఉండగా, ఫోటోగ్రాఫర్లు ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఆమె స్పష్టంగా "ఫోటోలు తీయవద్దు" అని కోరినా, వారు వినిపించకుండా కంటిన్యూ చేశారు.
దీంతో సమంత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. "ఆపండి" అని ఆమె చెప్పి కారులోకి వెళ్లిపోయారు.
Details
'అర్రే రుకో జీ' అంటూ అసహనం
ఇంకొక వీడియోలో, తన కారు కోసం ఎదురు చూస్తున్న సమంతను ఫోటోగ్రాఫర్లు వెంటాడుతూ ఫోటోలు, వీడియోల కోసం పిలుస్తుండగా ఆమె వారిని క్షమించండి, అర్రే రుకో జీ అంటూ అభ్యర్థించారు.
అయినప్పటికీ మీడియా వినకపోవడంతో, ఆమె నిరుత్సాహంతో తిరిగి కాంప్లెక్స్లోకి వెళ్లిపోయారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభిమానులు స్పందించారు. "ఇలా ఫోటోలు తీయకూడదని.. ఆమెను ఒంటరిగా వదిలేయండి" అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు "ప్రైవసీ ఇస్తే మేలు.. ఎవరైనా తమ వ్యక్తిగత జీవితం కోరుకుంటారన్నారు.
ఈ ఘటనపై నెటిజన్లు, ఫిల్మ్ లవర్స్ తరఫున సమంతకు మద్దతు పెరుగుతోంది. సెలబ్రిటీలకు గోప్యత అవసరం అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.