
Rashmika Mandanna : 'బేబీ' జంట కోసం వచ్చిన రష్మిక.. 'నైంటీస్' దర్శకుడితో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
ఈ వార్తాకథనం ఏంటి
గత ఏడాది "బేబి" సినిమాతో టాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించిన యువ హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ కొత్త సినిమా పేరు "నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్". ఇదే పేరుతో వచ్చిన వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో "బేబి" జంటగా పేరు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ జతకట్టనున్నారు. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాల మధ్య అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ క్రష్ రష్మిక మందన్న మొదటి క్లాప్ ఇచ్చింది.
వివరాలు
వెబ్ సిరీస్కు కొనసాగింపుగా "నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్" సినిమా
ప్రముఖ నటుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరోవైపు, ఈ సినిమా కథను దర్శకుడు వెంకీ అట్లూరి రచించి, ఆదిత్య హాసన్కు అందించాడు. "ప్రొడక్షన్ నెం. 32" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఒక ప్రేమకథ నేపథ్యంతో సాగనుంది. "నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్" వెబ్ సిరీస్కు కొనసాగింపుగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్యలతో పాటు నటుడు శివాజీ,వాసంతిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత నాగ వంశీ నిర్మించనున్నారు.