NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Actor Darshan: హత్యకేసులో దర్శన్‌కి ఊరట.. హైకోర్టు నుంచి ట్రావెల్ పర్మిషన్!
    తదుపరి వార్తా కథనం
    Actor Darshan: హత్యకేసులో దర్శన్‌కి ఊరట.. హైకోర్టు నుంచి ట్రావెల్ పర్మిషన్!
    హత్యకేసులో దర్శన్‌కి ఊరట.. హైకోర్టు నుంచి ట్రావెల్ పర్మిషన్!

    Actor Darshan: హత్యకేసులో దర్శన్‌కి ఊరట.. హైకోర్టు నుంచి ట్రావెల్ పర్మిషన్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 28, 2025
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో రేణుకాస్వామి హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

    కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగదీప, అతని అనుచరులు రేణుకాస్వామిని దాడి చేసి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

    ఈ కేసులో తాజాగా కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు కోర్టు అనుమతిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.

    ఇంతకుముందు బెంగళూరు సెషన్స్ కోర్టు దర్శన్‌కు ప్రయాణ పరిమితులు విధించింది.

    అయితే, ఈ కేసును సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని, తన క్లయింట్ దేశవ్యాప్తంగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

    Details

    అప్రూవర్లుగా మార్చేందుకు ఒత్తిడి

    అయితే ఆరోగ్య కారణాల పేరుతో బెయిల్ పొందిన దర్శన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రయాణానికి అనుమతి కోరడం పట్ల స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

    అయినా హైకోర్టు దర్శన్‌కు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 25న బెంగళూరు స్థానిక కోర్టుకు దర్శన్‌తో పాటు అతని భాగస్వామి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులు హాజరయ్యారు.

    ఈ కేసులో ఇతర నిందితులు తమను అప్రూవర్లుగా మార్చేందుకు పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

    రేణుకాస్వామి, దర్శన్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు ఆరోపణలున్నా పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

    Details

    131 రోజులు జైల్లో గడిపిన దర్శన్

    దీంతో దర్శన్ అనుచరులు అతడిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.

    అనంతరం హత్యకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్, పవిత్ర, మరో 15 మందిని 2024 జూన్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు.

    131 రోజుల పాటు జైల్లో గడిపిన దర్శన్, అక్టోబర్ 30, 2024న విడుదలయ్యాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    హైకోర్టు

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    కర్ణాటక

    Mysuru: మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్ భారతదేశం
    Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు  బెంగళూరు
    Mysore: మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రాచీన సంప్రదాయ పోటీ.. వైభవంగా 'వజ్రముష్టి కళగ' కుస్తీపోటీలు దసరా
    MUDA scam: ముడా కుంభకోణం చిచ్చు.. ఆరోపణల మధ్య మరిగౌడ రాజీనామా సిద్ధరామయ్య

    హైకోర్టు

    Gyanvapi: జ్ఞాన‌వాపి మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలకు అలహాబాద్ హైకోర్టు అనుమతి జ్ఞానవాపి మసీదు
    West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు కోల్‌కతా
    Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు  హిమాచల్ ప్రదేశ్
    Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు  నాగపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025