Suhas : మరో కొత్త సినిమా ప్రకటించిన సుహాస్.. దర్శకుడిగా సలార్ డైలాగ్ రైటర్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్'కు రైటర్'గా పని చేసిన రచయితతో నటుడు సుహాస్ హీరోగా ఓ మూవీని ప్రకటించేశారు. ఈ మేరకు వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఆయన హీరోగా ఏకంగా ఆరు సినిమాలు ఇప్పటికే ప్రకటనయ్యాయి. తాజాగా మరో సినిమాని కూడా ప్రకటించేశారు. అయితే తాజా సినిమా మాత్రం ప్రభాస్ సినిమా రైటర్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఈ మూవీ లాంచ్ ఈవెంట్ జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్స్'లో తెరకెక్కనుంది.
ప్రశాంత్ నీల్ రాకతో అంతా పరేషాన్
లాంచ్ ఈవెంట్'కి సలార్ డెరెక్టర్ ప్రశాంత్ నీల్, అనిల్ రావిపూడి, బలగం వేణు అతిథిలుగా వచ్చారు. ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వేణు మొదటి సీన్'కి దర్శకత్వం వహించారు. అయితే కార్యక్రమానికి ప్రశాంత్ నీల్ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ సినిమాను సందీప్ బండ్ల డైరెక్ట్ చేయనున్నారు. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్, సుహాస్ సినిమాని లాంచ్ చేయడం నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే భారీ విజయం అందుకున్న బేబీ మూవీకి ఈ దర్శకుడే సంగీతం అందించారు. సంగీర్తన ఈ సినిమాలో సుహాస్'కు జోడిగా నటించనున్నారు.