Trisha- Chiranjeevi: త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ చిరంజీవి
వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నటి త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'విశ్వంభర'. దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరంజీవి, త్రిష ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే త్రిష ఆదివారం హైదరాబాద్లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికరమైన విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి తనకు పంపిన ప్రత్యేక బహుమతిని ఇన్స్టాలో షేర్ చేసింది. ఉష్ణోగ్రతను నియంత్రించే స్మార్ట్ మగ్ను త్రిషకు చిరంజీవి బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్కు కృతజ్ఞతలు చెబుతూ..ఇన్స్టా స్టోరీలో త్రిష రాసుకొచ్చింది. ఈ చిత్రంలో సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.