
Vishnu Manchu: సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమ్ కానున్న'కన్నప్ప'
ఈ వార్తాకథనం ఏంటి
డైనమిక్ హీరో మంచు విష్ణు తన కొత్త చిత్ర 'కన్నప్ప'తో అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈ భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన తరువాత, 'కన్నప్ప' ఇప్పుడు ఓటీటీ వేదికపైకి రాబోతుంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చారిత్రక చిత్రం సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 'కన్నప్ప' మంచు విష్ణు కెరీర్లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. తిన్నడు పాత్రలో ఆయన పోషించిన గిరిజన యోధుడి వ్యక్తిత్వం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. కేవలం ప్రేక్షకులే కాక, ఈ చిత్రం విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది.
వివరాలు
స్పెషల్ అప్పియరెన్స్ లో ప్రభాస్, అక్షయ్ కుమార్
ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించగా,ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. న్యూజిలాండ్లోని అందమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం ఒక విజువల్ వండర్గా నిలిచింది. చిత్రంలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్లాల్, అర్పిత్ రాంకా, ప్రీతి ముకుందన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. అదేవిధంగా, ప్రభాస్, అక్షయ్ కుమార్ ప్రత్యేక పాత్రల ద్వారా సినిమాకు అదనపు ఆకర్షణను ఇచ్చారు. వారి స్పెషల్ అప్పియరెన్స్ సినిమాను ప్రేక్షకులకి మరింత హృదయానికి దగ్గర చేసింది. అలాగే కాజల్ అగర్వాల్, మధుబాల ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించి చిత్రానికి బలం చేకూర్చారు.
వివరాలు
ఓటీటీలోకి రాబోతున్న 'కన్నప్ప'
మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ ఈ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయగా, అతని కుమార్తెలు అరియానా, వివియానా ఒక పాటలో నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణను ఇచ్చింది. స్టీఫెన్ దేవస్సీ సంగీతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రత్యేకంగా 'శివా శివా శంకరా' పాట దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణను సంపాదించింది. 'కన్నప్ప' చిత్రం తిన్నడు అనే గిరిజన యోధుడి జీవితం, అతని ధైర్యం, విశ్వాసం,అంతర్గత బలాన్ని వివరించే కథగా నిలుస్తుంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ భక్తిరస చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు.